CM Revanth Reddy : రేపు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
- హైదరాబాద్ అభివృద్ధి పై రేపు సీఎం రేవంత్ - ప్రధాని మోడీ భేటీ
- మూసీ రివర్ ప్రాజెక్ట్, మెట్రో విస్తరణకు కేంద్ర సహాయం?
- కాంగ్రెస్ అధిష్టానం తో రాష్ట్ర రాజకీయాలపై కీలక చర్చ
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ముహూర్తం ఖరారయ్యింది. బుధవారం ఉదయం 10:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కార్యదర్శి శేషాద్రి, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్తో కలిసి ప్రధానిని కలవనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించనున్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, మెట్రో రైలు పొడిగింపు ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం, ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపు వంటి కీలక అంశాలపై ప్రధానిని సీఎం మెమొరాండం ద్వారా విజ్ఞప్తి చేయనున్నారు. నగరాభివృద్ధిలో భాగంగా కేంద్రం నుంచి మరిన్ని సహాయ నిధులను కోరే దిశగా ఈ భేటీ కొనసాగనున్నట్లు సమాచారం.
Also Read
- Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
Mahashivratri 2025: శివ లింగాలు ఎన్ని రకాలు.. వాటి విశిష్టత ఏంటి?
ఇక ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర కేబినెట్లోని పలువురు కీలక మంత్రులను కూడా కలవనున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు మద్దతుగా కేంద్ర మంత్రుల వద్ద ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ రాత్రికే సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం కాంగ్రెస్ అధిష్టానం నేతలను కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, తెలంగాణలో కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశముంది. కొత్తగా మంత్రివర్గంలో చేరబోయే నేతల ఎంపిక, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై పార్టీ పెద్దలతో ముఖ్యంగా చర్చించనున్నట్లు సమాచారం.
తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ పాలన, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న ఈ పర్యటనపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందబోయే సహాయ నిధులపై ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంకు ప్రధాని మోడీ నుంచి ఎలాంటి హామీలు లభిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!