CM Revanth Reddy: రాష్ట్రంలోని ఆ ఐదారుగురు సన్నాసుల గురించి పట్టించుకోను..
- ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని దేశానికి కావాలి
- 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉంది
- పెహల్గం దాడి తర్వాత.. ఇందిరమ్మ లాంటి ప్రధాని కావాలని కోరుతున్నారు
- ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ ప్రారంభ సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశానికి ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘నల్లమల డిక్లరేషన్’ను సైతం ఆవిష్కరించారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని తెలిపారు. అనంతరం ఇదిరా గాంధీ గురించి మాట్లాడారు. “దేశానికి ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలి. 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉంది. పెహల్గం దాడి తర్వాత.. ఇందిరమ్మ లాంటి ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారు. ఇందిరా గాంధీ పాకిస్థాన్ ను రెండుగా చీల్చి.. నిటారుగా నిలబడింది.” అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
READ MORE: Kakarla Suresh: అభివృద్ధి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపీఠ వేశారు!
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
అనంతరం.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆ సన్నాసులు చేసే తప్పుడు ప్రచారం తనకు లెక్క కాదని.. లబ్ధిపొందిన వాళ్ళు గుర్తు పెట్టుకుంటే చాలన్నారు. విషం చిమ్మాలని చూస్తున్నారని.. వాళ్ళ గురించి తాను పట్టించుకోనని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐదారుగురు సన్నాసులు ఉండొచ్చని.. వాళ్ళ గురించి పట్టించుకోనన్నారు.
READ MORE: Bhatti Vikramarka: గుడ్న్యూస్.. జూన్ 2న రాజీవ్ యువ వికాసం కింద రూ.1000 కోట్లు మంజూరు..!
నల్లమల్ల బిడ్డగా ఆ ప్రాంతం గురించి సీఎం ప్రస్తావించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతమని.. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారని గుర్తు చేశారు. సీఎంగా ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగిపోతోందన్నారు. పాలమూరు, నల్లమల ప్రాంత వాసినని గర్వంగా చెప్పుకొంటానన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటునని మరోసారి భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు వాసులను పిలిచేవారని.. ఇక్కడి ప్రజలు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నెముకగా నిలిచాయన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?