Bhatti Vikramarka: గుడ్న్యూస్.. జూన్ 2న రాజీవ్ యువ వికాసం కింద రూ.1000 కోట్లు మంజూరు..!
- తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా "దున్నేవాడిదే భూమి నినాదం"
- ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం పథకాల ద్వారా చట్టాలుగా అమలు
- తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే..
- మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలి
- అచ్చంపేట బహిరంగ సభలో ప్రసంగించిన భట్టి విక్రమార్క
తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవాడిదే భూమి నినాదాన్ని ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు. నల్లమల డిక్లరేషన్ను తూచా తప్పక పాటించి నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర గిరిజనులకు ఫలితాలు అందిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రారంభం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు.. దేశంలోనే గర్వించదగిన గొప్ప కార్యక్రమమని కొనియాడారు. గత ప్రభుత్వంలో గిరిజనులు పంట పండించుకోవడానికి వెళితే మహిళలని చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టారని.. పురుషులపై పోలీసు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
READ MORE: Bandi Sanjay: అందాల పోటీలకైతే 300 కోట్లు.. పుష్కరాలకు రూ.35 కోట్లేనా?
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
రాష్ట్రం అభివృద్ధి చెంద వద్దని, ఫలితాలు ప్రజలకు అందవద్దని నిత్యం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై ఒక మాట అన్న, కుట్ర చేసిన అది రాష్ట్ర ప్రజలపై కుట్రగానే భావిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. జూన్ 2న గిరిజన యువతకు రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం ద్వారా 1000 కోట్లు మంజూరు చేయబోతున్నామని తీపి కబురు చెప్పారు. ఇది పేదల ప్రభుత్వం మన ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని కాపాడుకోండని పిలుపునిచ్చారు.. ఇందిరా జల వికాసం ఆరంభం మాత్రమే కాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని నల్లమల్ల సాక్షిగా మాట ఇచ్చారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా ఓ ఉమ్మడి కుటుంబాన్ని, అద్భుతమైన సమాజాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు.
READ MORE: AP and Telangana Police: భారీ పేలుళ్లకు కుట్ర.. రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు..
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!