CM Revanth Reddy : అందరూ సిద్ధంగా ఉండండి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
- ఆపరేషన్ సింధూర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ
- భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు ర్యాలీ
- సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ.. హాజరుకానున్న సీఎం రేవంత్, మంత్రులు, ఇతర నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అత్యవసర సమీక్ష నిర్వహించారు. దేశ భద్రత, ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం తరఫున చేపట్టాల్సిన చర్యలపై సీఎం కీలక సూచనలు చేశారు. ఈ సమయంలో ప్రజలకు మనమంతా భారత సైన్యంతో ఉన్నామనే స్పష్టమైన సందేశం వెళ్లాలన్నారు. రాజకీయాలకు, పార్టీ లకు తావు లేకుండా మొత్తం యంత్రాంగం ఒక్కటిగా పని చేయాలని స్పష్టం చేశారు.
అత్యవసర సేవల శాఖల ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని, వారు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షల్లో పాల్గొనాలని, విదేశీ పర్యటనలు తక్షణమే రద్దు చేసుకోవాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించాలని ఆదేశించారు.
Also Read
- Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
- AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జిల్లా కలెక్టరేట్లలో భారీ మార్పులు..!
- 185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
- Ayodhya Ram Mandir Trust: నేటి అయోధ్య ట్రస్ట్ భేటీపై ఉత్కంఠ.. ఐదు ప్రధాన అజెండాలు
Chiranjeevi : ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ మూవీ కోసం చిరూ, శ్రీదేవి ఎంత తీసుకున్నారో తెలుసా..
రెడ్ క్రాస్ సమన్వయంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధంగా ఉంచాలని, అత్యవసర మెడిసిన్ స్టాక్ సిద్ధం చేయాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి, సమాచారం తీసుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాలో అసత్య సమాచారం పంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం హెచ్చరించారు. ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో ఆందోళన పెరగకుండా అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా ప్రకటనల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి అనధికారికంగా నివసిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ కంపెనీలు, ఇతర కీలక ప్రాంతాల్లో భద్రత పెంచాలని సూచించారు. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తులపై పోలీస్ శాఖ కఠిన నజరం ఉంచాలని తెలిపారు. సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి తలెత్తిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
-
Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
God of War: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై రాజకీయ దుమారం.. తమిళనాడులో విడుదల అడ్డుకుంటామంటూ హెచ్చరిక
-
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జిల్లా కలెక్టరేట్లలో భారీ మార్పులు..!
ట్రెండింగ్
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!