CM Revanth Reddy : అందరూ సిద్ధంగా ఉండండి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
- ఆపరేషన్ సింధూర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ
- భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు ర్యాలీ
- సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ.. హాజరుకానున్న సీఎం రేవంత్, మంత్రులు, ఇతర నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అత్యవసర సమీక్ష నిర్వహించారు. దేశ భద్రత, ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం తరఫున చేపట్టాల్సిన చర్యలపై సీఎం కీలక సూచనలు చేశారు. ఈ సమయంలో ప్రజలకు మనమంతా భారత సైన్యంతో ఉన్నామనే స్పష్టమైన సందేశం వెళ్లాలన్నారు. రాజకీయాలకు, పార్టీ లకు తావు లేకుండా మొత్తం యంత్రాంగం ఒక్కటిగా పని చేయాలని స్పష్టం చేశారు.
అత్యవసర సేవల శాఖల ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని, వారు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షల్లో పాల్గొనాలని, విదేశీ పర్యటనలు తక్షణమే రద్దు చేసుకోవాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించాలని ఆదేశించారు.
Also Read
Chiranjeevi : ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ మూవీ కోసం చిరూ, శ్రీదేవి ఎంత తీసుకున్నారో తెలుసా..
రెడ్ క్రాస్ సమన్వయంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధంగా ఉంచాలని, అత్యవసర మెడిసిన్ స్టాక్ సిద్ధం చేయాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి, సమాచారం తీసుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాలో అసత్య సమాచారం పంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం హెచ్చరించారు. ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో ఆందోళన పెరగకుండా అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా ప్రకటనల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి అనధికారికంగా నివసిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ కంపెనీలు, ఇతర కీలక ప్రాంతాల్లో భద్రత పెంచాలని సూచించారు. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తులపై పోలీస్ శాఖ కఠిన నజరం ఉంచాలని తెలిపారు. సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి తలెత్తిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
-
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
-
Trump Hair: హెయిర్స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!