CM KCR: బీఆర్ఎస్సే రాష్ట్రానికి శ్రీరామరక్ష.. సంక్షేమం అమలు, రాష్ట్రం అభివృద్ధే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్లో ఏం చేస్తారు అని ఆలోచించాలని కోదాడలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. ఓటు మన చేతిలో బ్రహ్మాస్తమని, పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణ రాక ముందు సాగర్ నీళ్ల కోసం రైతులు నా దగ్గరకు వచ్చారని.. 24 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చామన్నారు. నాగార్జున సాగర్ పేరు నందికొండ ప్రాజెక్టు.. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సింది.. గోల్మాల్ చేసి దిగువన ప్రాజెక్టు కట్టారన్నారు సీఎం కేసీఆర్.
Also Read: T.Congress: ఎన్నికల ముందు కాంగ్రెస్కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ” ప్రజలను నమ్ముకునే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించా.. ఆనాడు కాంగ్రెస్ నేతలు నోరు మూసుకున్నారు కాబట్టి మనం ఇబ్బందులు పడుతున్నాం. సాగర్ ఆయకట్టు కాపాడుకుతాము. రైతులను ఆదుకోవాలని, కాపాడుకోవాలనే గులాబీ జండా కప్పుకున్నా. బీసీ బిడ్డ మల్లయ్య యాదవ్ను గెలిపించాలి. కోదాడ లో బీసీల చైతన్యం చూపించాలి.మల్లయ్య యాదవ్కు టికెట్ వద్దని అన్నారు… కానీ నేను టికెట్ ఇచ్చి ఆశీర్వదించినా. అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కావాలని ఎవరూ అడగలేదు.. తెలంగాణ సమాజం గురించి తెలిసిన నేను ఆ పథకాలను ప్రారంభించాను. కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు వద్దు అంటుండు.. కాంగ్రెస్ కావాలో…. BRS కావాలో ప్రజలు తేల్చుకోవాలి.. సంక్షేమం అమలు, రాష్ట్రం అభివృద్దే BRS లక్ష్యం. కోదాడలో రూ.10 కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తాం. కాళేశ్వరం నీళ్లు రాలేదని భట్టి చెబుతున్నారు. కోదాడకు మూడేళ్లుగా కాళేశ్వరం నీళ్లు వస్తున్నయి. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా ఎలా వస్తుంది? ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఎలా వస్తాయి?” అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?