Site icon NTV Telugu

CM KCR : ప్రగతి పథాన్ని అడ్డుకునే ‘దుష్టశక్తుల’ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Kcr Namination

Kcr Namination

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆదివారం దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయోత్సవానికి గుర్తుగా జరిగే పండుగకు హిందూ సంస్కృతిలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. చీకటిని పారద్రోలి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. వెలుగుల పండుగ అజ్ఞానాన్ని పోగొడుతుందని, చైతన్యాన్ని రగిలించడంతోపాటు నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మనలో అంతర్గత జ్వాల రగిలినప్పుడు జీవితాలు మరింత అర్థమవుతాయి. ప్రగతి పథాన్ని అడ్డుకునే ‘దుష్టశక్తుల’ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా నియమాలను పాటిస్తూ పటాకులు పేల్చి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు లక్ష్మీదేవి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Exit mobile version