CM Jagan: మూడుసార్లు సీఎంగా చేసి ప్రజల్ని మోసం చేసారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ మోహాన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం అందించామని తెలిపారు. అవ్వా తాతలకు ఇంటి వద్దకే పింఛన్, రేషన్, పథకాలు, పౌర సేవలు తలుపుతట్టి అందిస్తున్నాని అన్నారు. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మహిళలకు, మత్స్యకారులు, నేతన్నలకు తోడుగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు.. మూలపేట పోర్టు కడుతున్నాం.. భోగాపురం ఎయిర్ పోర్ట్, ఉద్దానం కిడ్ని సమష్యకు పరిష్కారం చూపించే విధంగా రూ.700 కోట్ల త్రాగునీటి ప్రాజెక్ట్ చేపట్టామని సీఎం చెప్పారు. అంతేకాకుండా.. రూ. 80 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసామని.. 4 మెడికల్ కళాశాలలు కడుతున్నామని అన్నారు. కురుపాంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని.. నాలుగు వందల కోట్లతో నాలుగు వందల సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటు చేసామని సీఎం జగన్ తెలిపారు.
Arya: నా జీవితాన్నే మార్చేసిన సినిమా.. ఎమోషనలైన బన్నీ..
Also Read
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ పేదకైనా పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒకటైనా ఉందా..? అని సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడుసార్లు సీఎం చేసి ప్రజల్ని మోసం చేసారని అన్నారు. అధికారంలోని వచ్చేందుకు ఎన్నో అబద్దాలు చెప్పారని.. 2014లో హామీలు బాబు అమలు చేసారా.? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణ మాఫీ చేస్తామని చేసారా? అని పేర్కొన్నారు. అడబిడ్డ పుడితే మహాలక్ష్మీ పథకం అన్నారు..? ఏ ఒక్కరి అకౌంట్ లో ఒక్క రూపాయి వేసారా?.. ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చారా.? అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నారు.. ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు భూమి ఇచ్వారా.? అని సీఎం దుయ్యబట్టారు.
Konda Sangeetha Reddy: ప్రజలందరి గుండెల్లో మోడీ నిలిచిపోయారు..
చంద్రబాబు సింగపూర్ సిటీ అన్నారు చేసారా.?.. ప్రతి పట్టణం హైటెక్ సిటీ అన్నారు చేసారా..? ఏ ఒక్క హామీ అమలు చేయని బాబుని నమ్మవచ్చా? అని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజలు అందరూ ఆలోచించి ఓటేయాలని కోరారు. మోసాలు, అబద్దాలపై యుద్ధం చేస్తున్నామని.. ఇంటింటికీ వచ్చే అవ్వా తాతల పింఛన్ అడ్డుకున్నారని తెలిపారు. ఇన్ని నెలలు పింఛన్ అందించిన జగన్, చివరి రెండు నెలలు అందించలేడా..? అని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ప్రజల దీవెనలు ఉన్నాయని సీఎం తెలిపారు. నా అక్కచెల్లెమ్మాలు, అవ్వతాతలు, రైతన్నాలు అండగా నిలబడతారన్నారు. బాబు ఓటుకు రెండు లేదా నాలుగు వేలు ఇస్తాడని.. ఎన్నికలలోనే బాబు డబ్బులు ఇస్తారని తెలిపారు. తాను ప్రతి ఏటా క్యాలండర్ ఇచ్చి మరీ సంక్షేమం చేసేందుకు సాకులు చూపలేదు.. వెనకడుగు వేయలేదన్నారు.చంద్రబాబు డబ్బులు ఇస్తే వద్దనకుండా తీసుకోండి.. ఓటు వేసేప్పుడు మాత్రం ప్యాన్ను గుర్తుపెట్టుకోండి సీఎం జగన్ తెలిపారు.
తాజావార్తలు
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!