CM Jaganmohan Reddy Anakapally Tour: అనకాపల్లిలో రేపు సీఎం జగన్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు అనకాపల్లిజిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన జరగనుంది. మాకవరపాలెంలో సుమారు 500కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి., మెడికల్ కాలేజ్ కోసం సీఎం భూమి పూజ చేస్తారు. ఈ మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తే అనకాపల్లి జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని నాలుగైదు మండలాలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయి.
Read Also: Dhamaka: ఒరేయ్ ఆజాము… మాస్ పార్టీ మొదలయ్యింది రోయ్…
Also Read
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
తాండవ ఆయకట్టు రైతులతో పాటు మెట్ట ప్రాంత భూములను సస్యశ్యామలం చేసే కీలకమైన తాండవ ఎత్తిపోతలకు సీఎం జగన్ రేపు శంకుస్థాపన చేస్తారు. ఏలేరు జలాలను తాండవ రిజర్వాయర్ కు మళ్ళించడం ద్వారా సుమారు 60వేల ఎకరాలకు అదనంగా సాగునీటి ని పంపిణీ చేయడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. సుమారు 450కోట్ల రూపాయలను ఇందు కోస్ వెచ్చిస్తుండగా నాలుగు నియోజకవర్గాల పరిధిలో రైతులకు మేలు చేకూరుతుంది. సీఎం పర్యటనలో భాగంగా నర్సీపట్నం మండలం జోగు నాథుని పాలెంలో భారీ బహిరంగ సభ జరగనుంది.
ఈ బహిరంగసభ కోసం భారీ ఏర్పాట్లు చేయగా అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. శుక్రవారం ఉదయం 11గంటలకు నేరుగా సభాస్థలికి చేరుకుంటారు సీఎం జగన్. అక్కడి నుంచే శంఖుస్థాపనలు పూర్తి చేస్తారు. సీఎం పర్యటన మొత్తం 2గంటల పాటు కొనసాగుతుంది. ఈ పర్యటనకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు వైసీపీ నేతలు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.
Read Also: CS Somesh Kumar: ఢిల్లీలో తెలంగాణ సీఎస్.. పెండింగ్ నిధుల చెల్లింపుపై కేంద్ర కార్యదర్శులతో మీటింగ్
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?