Rahul Gandhi Dance: రాజస్థాన్‌లో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నేతల డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi Dance: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌కు చేరుకోగా.. రాష్ట్రంలోని సీనియర్ నేతల మధ్య విభేదాలు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులైన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌ తమ విభేదాలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఝలావర్‌లో జరిగిన భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు వేదికపై రాహుల్ గాంధీతో కలిసి గిరిజన నృత్యంలో పాల్గొనడానికి చేతులు జోడించి నృత్యం చేశారు. ఒకే వేదికపై సీనియర్ నేతలైన రాహుల్ గాంధీ ,అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, కమల్ నాథ్‌లు స్టెప్పులు వేయడం గమనార్హం. వేదికపై గిరిజన నృత్య బృందం ప్రదర్శించినప్పుడు కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కూడా వేదికపై ఇతరులతో కలిసి వచ్చారు.

Mahakal Temple: ఆలయంలోనే మహిళా భద్రతా సిబ్బంది చిందులు.. వీడియో వైరల్‌ కావడంతో!

గాంధీ రాజస్థాన్ రాకముందు, అశోక్ గెహ్లాట, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య రాష్ట్రంలో పోస్టర్ యుద్ధం జరిగింది. రాజస్థాన్‌లోని ఝలావర్‌లో మాట్లాడిన గాంధీ వారసుడు కాంగ్రెస్‌ను మహాత్మా గాంధీ పార్టీగా అభివర్ణించారు. “ఇది మహాత్మా గాంధీ పార్టీ, సావర్కర్ లేదా గాడ్సే కాదు. కష్టపడి పనిచేయడం మాకు తెలుసు” అని రాహుల్ గాంధీ అన్నారు. తాను బీజేపీని లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ను ద్వేషించనని, అయితే దేశాన్ని “భయంతో బతకనివ్వబోనని” అన్నారు. “ద్రవ్యోల్బణం పెరుగుతోంది, కానీ మొత్తం డబ్బు ముగ్గురు నలుగురు పారిశ్రామికవేత్తలకు వెళుతోంది. ఇది సరైనది కాదు,” అన్నారాయన.