Site icon NTV Telugu

CM Chandrababu: 15 మంది ఎమ్మెల్యేలు దారికొచ్చారు, మరో నలుగురిపై చర్యలు.. సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్!

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu Warns MLAs: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజా రాజకీయ పరిణామాలపై అందుబాటులో ఉన్న మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. నిన్న రాత్రి సమీక్షా సమావేశాలు ముగిసిన అనంతరం సీఎం ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.

ఇటీవల సుమారు 40 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడినట్లు మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపినట్టు సమాచారం. ఆ చర్చల అనంతరం దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు తన సూచనలతో దారికొచ్చారని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. అదే సమయంలో నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారట. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు సీఎం మంత్రులకు తెలిపారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: CM Chandrababu: రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం.. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలపై సీఎం సమీక్ష!

ఇక పార్టీ బలోపేతం కోసం ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ మధ్య సమన్వయం మరింత బలపడాల్సిన అవసరం ఉందని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలతో అనుసంధానం పెంచుకోవడం, పార్టీ కార్యకర్తలతో సమన్వయం మెరుగుపరచడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల వ్యూహాలు వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. సీఎం తీసుకునే నిర్ణయాలు పార్టీ లోపల ఎలా ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

 

Exit mobile version