CM Chandrababu : మద్యం దుకాణదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణదారులకు శుభవార్త అందించింది
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను పెంచే నిర్ణయం తీసుకున్నారు
- ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తున్నారు
- 14 శాతం మార్జిన్ ఇవ్వాలని నిర్ణయించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణదారులకు శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను పెంచే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తున్నారు, కానీ ఈ మార్జిన్ అప్రతిపాదితంగా ఉన్నది అని, దుకాణ యజమానులు పెంచాలని కోరిన నేపథ్యంలో, ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను పరిశీలించి, తెలంగాణలో ఇచ్చిన విధంగా ఇక్కడ కూడా 14 శాతం మార్జిన్ ఇవ్వాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంగా ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ముఖ్యంగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపుల్లో గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయానికి సంబంధించి, వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Also Read
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులలో 340 షాపులు గీత కులాలకు కేటాయిస్తారు. గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీసాయన, శెగిడి, గౌండ్ల, యాత, సోదీ వంటి కులాలకు ఈ షాపులు కేటాయిస్తారు. షాపుల కేటాయింపు ఆయా కులాల సంఖ్య ఆధారంగా నిర్ణయించబడుతుంది. ప్రతి వ్యక్తి ఒక్కొక్క షాపు కోసం ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ ఒక వ్యక్తికి ఒక్కటే షాపు కేటాయిస్తారు. ఈ షాపులు 2026 సెప్టెంబర్ 30 వరకు నడుస్తాయని ప్రకటించారు.
మరోవైపు, రూ. 99కి మద్యం అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై కూడా చర్చ జరిగింది. మద్యం అమ్మకాలు ప్రతీ సంవత్సరం పెరుగుతున్నా, తక్కువ రేట్లలో మద్యం విక్రయించడం వల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం లభించడం లేదని అధికారులు తెలిపారు. అయినా, మద్యం అన్ని చోట్లా తక్కువ రేట్లలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని, మద్యం తయారీ, సరఫరా, సేల్స్ను టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించి, నిబంధనల ఉల్లంఘన నివారించాలన్నారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర , ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
-
Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!