CM Biren Singh: “రాజీనామా ప్రసక్తే లేదు.. వచ్చే ఆరు నెలల్లో మణిపూర్ లో శాంతి ఖాయం!”
- వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో సంపూర్ణ శాంతి
- రాజీనామా ప్రశ్నే లేదన్న సీఎం బీరెన్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో సంపూర్ణ శాంతి నెలకొంటుందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు. పదవి నుంచి వైదొలగడానికి నిరాకరించిన ఆయన, తాను ఎలాంటి నేరం చేయలేదని, కుంభకోణం చేయలేదని చెప్పారు. గురువారం ఒక ఇంటర్వ్యూలో.. ఎన్ బీరెన్ సింగ్.. కుకీ-జో-మెయిటీ నాయకులతో మాట్లాడటానికి ఒక రాయబారిని నియమించినట్లు వెల్లడించారు. మణిపూర్లో 2023 మే నుంచి కుల హింస కొనసాగుతుండటం గమనార్హం. కుకీ-జో- మెయిటీ జాతుల మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటివరకు 226 మంది మరణించారు. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవచ్చని ఎన్ బీరెన్ సింగ్ అన్నారు. చర్చల కోసం సీఎం ఎన్ బీరేన్ సింగ్ నాగా ఎమ్మెల్యే.. హిల్ ఏరియా కమిటీ చైర్మన్ డింగ్ంగ్లుంగ్ గాంగ్మీ నియమించారు.
READ MORE: Carlos Alcaraz: సంచలనం.. రెండవ రౌండ్లోనే కార్లోస్ అల్కరాజ్కు ఎదురుదెబ్బ..
Also Read
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
కాగా.. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మణిపూర్ రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు నెలకొన్నాయి. జిరిబామ్ జిల్లాలో మైతీ వర్గానికి చెందిన సోయిబమ్ శరత్కుమార్ అనే వ్యక్తిని కుకీ మిలిటెంట్లు దారుణంగా హత్య చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శరత్ అనే వ్యక్తి తన పొలం నుంచి తిరిగి వస్తుండగా మాయమైపోయాడని, శరీరంపై పదునైన వస్తువుతో పొడిచినట్టు గాయాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, స్థానికంగా ఉండే ఇళ్లకు నిప్పు పెట్టారు.. దీంతో జిరిబామ్ జిల్లా మేజిస్ట్రేట్ అల్లర్లను నిరోధించడానికి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించేశారు. ఘటనా తర్వాత అస్సాం రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, మణిపూర్ పోలీస్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ అధికారులతో కూడిన జాయింట్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. మరోవైపు మణిపూర్ హింసాకాండకు కీలకమైన నిందితుడు థోంగ్మింథాంగ్ హౌకిప్ అలియాస్ రోజర్ని ఈ నెల 6న ఇంఫాల్ లోని ఎయిర్ పోర్టులో ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. అతనిపై గతేడాది జూలై 18వ తేదీన ఎన్ఐఏ కేసు ఫైల్ చేసింది.
తాజావార్తలు
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
-
Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!