NTV Telugu Site icon

Bhatti Vikramarka : బండి సంజయ్ ఉన్మాది.. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

CLP Leader Bhatti Vikramarka About MLA Komatireddy Rajgopal Reddy Issue.

గత కొంతకాలంగా కాంగ్రెస్‌ క్రియాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలోకి చేరున్నట్లు వార్తలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మాట్లాడుతూ త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ చేరుతారని.. అందుకు తేదీని కూడా ప్రకటిస్తామని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో.. ఇప్పడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న తరుణంలో కాంగ్రెస్‌ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై సీరియస్‌గా ఉంది. అయితే తాజాగా ఢిల్లీలో కేసీ వేణు గోపాల్ నివాసంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మానిక్కం ఠాగూర్‌లు భేటీ అయ్యారు.

 

ఈ భేటీ అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గంట సేపు చర్చించామని, పార్టీలో కొందరు చేరుతారని తెలిపారు. వాళ్లకు క్లియరెన్స్ తీసుకున్నామని.. అలాగే..రాజ్ గోపాల్ రెడ్డి అంశంపై చర్చించామన్నారు. మా గౌరవ శాసన సభ్యుడని, ఆయనతో మాయ్లట్లాడుతామని భట్టి తెలిపారు. మా పార్టీలోనే రాజ్ గోపాల్ ఉన్నాడని, బండి సంజయ్ ఉన్మాది అంటూ భట్టి విమర్శించారు. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్న భట్టి.. రాజ్ గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అంటే ప్రేమ ఉందని, పార్టీలో కొనసాగించేలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.