AP Crime: వైన్స్ దగ్గర గొడవ.. ఒకరి హత్య
- పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ
- పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40).. దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మధ్య తీవ్ర వాగ్వాదం
- భాస్కరరావు చాతీ భాగంలో గాజుపెంకుతో పొడిచిన రామకృష్ణ
- అపస్మారక స్థితికి చేరుకున్నాడు భాస్కరరావు.. చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు భాస్కరరావు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: బాగా మద్యం సేవించిన తర్వాత.. రకరకాల గొడవలు జరుగుతుంటాయి.. కొన్నిసార్లు అవి చిలికిచిలికి గాలివానగా మారుతుంటాయి.. మరికొన్నిసార్లు.. మద్యం మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా.. దాడులు, ప్రతిదాడులు.. హత్యలు జరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు.. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఇలాంటి ఘటనే జరిగింది.. మద్యం మత్తులో ఇరువురి మధ్య ఘర్షణ జరగగా.. ఒకరు హత్యకు గురయ్యారు.. తణుకు మండలం దువ్వ గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది..
Read Also: Tamilisai: అమిత్ షాతో సంభాషణపై తమిళిసై వివరణ
Also Read
పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40), దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మధ్య.. దువ్వలోని ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర తీవ్ర వాగ్వాదం జరిగింది.. అయితే, గొడవ ఎందుకేలే అని.. కాస్త వెనక్కి తగ్గిన భాస్కరరావు.. మోటారుసైకిల్పై వెళ్లిపోతుండగా.. అతడిపై గాజుపెంకుతో చాతీ భాగంలో పొడిచాడు రామకృష్ణ అనే వ్యక్తి.. ఇక, అలాగే బండిపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు భాస్కరరావు.. ఆ తర్వాత చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు భాస్కరరావు మృతిచెందాడు.. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన తణుకు రూరల్ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై కె.చంద్రశేఖర్.. కేసు నమోదు చేసి నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..
తాజావార్తలు
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!