Civil Supply Inspections : బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు..
- బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు
- సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ డైరెక్టర్ మహేష్ నాయుడు ఆకస్మిక తనిఖీ
- సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ను వెంట బెట్టుకొని తనిఖీకి వెళ్లిన మహేష్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Civil Supply Inspections : నంద్యాల బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ డైరెక్టర్ మహేష్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. సివిల్ సప్లై జిల్లా మేనేజర్ను వెంట బెట్టుకొని తనిఖీకి వెళ్లారు మహేష్ నాయుడు. సమాచారం తెలిసి అప్పటికే గోడౌన్ నుంచి సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 11 వరకు వేచి వుండి తాళాలు తెప్పించి డైరెక్టర్ మహేష్ నాయుడు తనిఖీ చేశారు. సిబ్బంది రికార్డులు మాయం చేసినట్లు సమాచారం. బియ్యమే బస్తాలు స్వయంగా కౌంట్ చేసిన మహేష్ నాయుడు.. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో 398 బియ్యం బస్తాలు తక్కువ ఉన్నట్లు గుర్తించారు. మరో ప్రైవేట్ గోదాములో 685 బస్తాలు మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు. బియ్యం స్టాక్ పై జిల్లా మేనేజర్ ను రికార్డులు అడిగిన మహేష్.. ఇప్పటి వరకు రికార్డులు జిల్లా మేనేజర్ ఇవ్వలేదని సమాచారం.
PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నరేంద్ర మోడీ నివాళి..
Also Read
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
- Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
- Rajat Patidar: టీమిండియాలోకి ఎంట్రీ? నాకైతే అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..
- Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
ఈ విషయంపై సివిల్ సప్లై ఎండికి, జాయింట్ కలెక్టర్ కు డైరెక్టర్ సమాచారం ఇచ్చారు. 1300 బస్తాలు రేషన్ బియ్యం మాయం అయ్యాయని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీలపై రెవెన్యూ అధికారులు నోరు మేదపడం లేదు. రికార్డులు సరిగాలేవని డైరెక్టర్ తనిఖీల్లో నిర్ధారణ అయ్యింది. ప్రతిరోజు క్లోజింగ్ బ్యాలెన్స్ నమోదు చేయాల్సిన అధికారులు.. అక్రమాలు వెంటనే బయటపడే అవకాశం వున్నా అధికారుల మౌనంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోనసీమ నుంచి బేతంచెర్ల గోదాములకు, పాలకొన్లు నుంచి నంద్యాల గోదాములకు రేషన్ బియ్యం సరఫరా అవుతున్నాయి. అయితే బేతంచెర్ల కు పాలకొల్లు నుంచి నిన్న బియ్యం సరఫరా అయ్యింది. అక్రమాలు బయట పడతాయని అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. బేతంచెర్ల గోదాముల్లో ఒకటి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చెందినదిగా అధికారులు చెబుతున్నారు.
Manchu Vishnu : సీఎంతో మీటింగుకు ‘మా’ ప్రెసిడెంట్ గైర్హాజరు.. ఆయన రాకపోవడానికి కారణం ఇదేనా ?
తాజావార్తలు
-
Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
-
Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
-
BSNL JTO Recruitment 2026: జాబ్ కావాలా?.. బీఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు రెడీ.. అర్హతలు, పూర్తి వివరాలు
-
Rajat Patidar: టీమిండియాలోకి ఎంట్రీ? నాకైతే అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..
-
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..