AP CID: హైకోర్టుకు చంద్రబాబుపై సీఐడీ ఫిర్యాదు చేసే ఛాన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టై అయ్యారు. గత 53 రోజులుగా రాజమండ్రి సెట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబుకి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు అనగా నవంబర్ 24వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
Read Also: Rahul Gandhi : దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరగబోతుంది
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
అయితే, బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఏపీ హైకోర్టు పలు కండిషన్లు జారీ చేసింది. కేవలం కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేశామనింది. చంద్రబాబు కేసుని ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. మీడియా, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని కోర్టు పేర్కొనింది. హస్పటల్, ఇంటికి మాత్రమే చంద్రబాబు పరిమితం కావాలని కోర్టు ఆదేశించింది. ఇక, ఈ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుందని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలోనే చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు.
Read Also: VarunLav: హల్దీ వేడుక.. హైలైట్ అంటే మెగాస్టారే..
కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు నిబంధనలకు విరుద్దంగా జైలు గేటు వరకు టీడీపీ కార్యకర్తలు తోసుకు వొచ్చి స్వాగతం పలికారు. అయితే, ర్యాలీగా రాకూడదని న్యాయస్థానం షరతులు పెట్టినప్పటికి టీడీపీ శ్రేణుల సమూహంతో చంద్రబాబు రోడ్డుపైకి వచ్చారు. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు.. ఇక, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు తుంగలో తొక్కారు అని సీఐడీ అధికారులు అంటున్నారు. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించారనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఏపీ సీఐడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించిన ఆయనపై హైకోర్టులో ఫిర్యాదు చేసేందుకు ఏపీ సీఐడీ రెడీ అయినట్లు టాక్.
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..