AP CID: హైకోర్టుకు చంద్రబాబుపై సీఐడీ ఫిర్యాదు చేసే ఛాన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టై అయ్యారు. గత 53 రోజులుగా రాజమండ్రి సెట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబుకి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు అనగా నవంబర్ 24వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
Read Also: Rahul Gandhi : దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరగబోతుంది
Also Read
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
అయితే, బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఏపీ హైకోర్టు పలు కండిషన్లు జారీ చేసింది. కేవలం కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేశామనింది. చంద్రబాబు కేసుని ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. మీడియా, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని కోర్టు పేర్కొనింది. హస్పటల్, ఇంటికి మాత్రమే చంద్రబాబు పరిమితం కావాలని కోర్టు ఆదేశించింది. ఇక, ఈ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుందని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలోనే చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు.
Read Also: VarunLav: హల్దీ వేడుక.. హైలైట్ అంటే మెగాస్టారే..
కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు నిబంధనలకు విరుద్దంగా జైలు గేటు వరకు టీడీపీ కార్యకర్తలు తోసుకు వొచ్చి స్వాగతం పలికారు. అయితే, ర్యాలీగా రాకూడదని న్యాయస్థానం షరతులు పెట్టినప్పటికి టీడీపీ శ్రేణుల సమూహంతో చంద్రబాబు రోడ్డుపైకి వచ్చారు. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు.. ఇక, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు తుంగలో తొక్కారు అని సీఐడీ అధికారులు అంటున్నారు. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించారనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఏపీ సీఐడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించిన ఆయనపై హైకోర్టులో ఫిర్యాదు చేసేందుకు ఏపీ సీఐడీ రెడీ అయినట్లు టాక్.
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!