China ETIM threat: చైనాను భయపెడుతున్న ఉగ్రసంస్థ.. బీజింగ్ భయానికి కారణాలు ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China ETIM threat: చైనాను ఓ ఉగ్రవాద సంస్థ భయపెడుతుంది. అగ్రరాజ్యం అమెరికాను దాటి ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని చూస్తున్న డ్రాగన్ దేశానికి ఓ ఉగ్రవాద సంస్థ కంట్లో నలుసులా మారింది. బుధవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం అనే ఉగ్రవాద సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని చైనా డిమాండ్ చేసింది. ఓ అంతర్జాతీయ పత్రిక కథనం ప్రకారం.. ఐక్యరాజ్యసమితిలో చైనా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి జెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమానికి చెందిన వేలాది మంది ఉగ్రవాదులు మళ్లీ సిరియాలో చురుకుగా మారారని అన్నారు. వాళ్లందరూ సిరియాలో బలం పెంచుకొని తమ పరిసరాల్లో భయాన్ని వ్యాపింపజేస్తున్నారని అన్నారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఉగ్రవాద సంస్థను ఆపకపోతే మధ్యప్రాచ్యం నుంచి దక్షిణాసియా వరకు ఉన్న దేశాలు నాశనం అవుతాయని హెచ్చరించారు.
READ MORE: Judge Frank Caprio: ఈ జడ్జి చాలా స్పెషల్.. ఇక లేరంటూ కుటుంబం పోస్ట్..
Also Read
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
ఏంటీ తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం?
1990లో పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్లో హసన్ మహ్మూన్ ఈ తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమాన్ని స్థాపించారు. ఈ ఉగ్రవాద సంస్థ అంతిమ లక్ష్యం తుర్కిస్థాన్ అనే ప్రత్యేక దేశాన్ని సృష్టించడం. విదేశీ సంబంధాల మండలి నివేదికల ప్రకారం.. చైనాలోని ఉయ్ఘర్లకు ప్రత్యేక దేశం ఏర్పాటుకు సహాయం చేయడానికి ఈ ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించిందని పేర్కొన్నాయి. ప్రారంభంలో ఈ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా నుంచి నిధులు పొందేది. 2002లో ప్రపంచం ఈ ఉగ్రవాద సంస్థపై నిషేధం విధించడం ప్రారంభించింది. 2003లో పాకిస్థాన్ సహాయంతో చైనా ఈ ఉగ్రసంస్థ
వ్యవస్థాపకుడు హసన్ మహమూన్ను చంపింది. తర్వాత 2010లో మహమూన్ వారసుడు అబ్దుల్ హక్ను కూడా చంపింది. దీని తర్వాత ఈ సంస్థ తెరవెనుక నుంచి కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించింది. నాటి నుంచి ఈ ఉగ్రసంస్థ అధినాయకుడు ఎవరో ప్రపంచానికి తెలియదు.
ఇప్పటికే చైనాలో ప్రకంపనలు..
చైనాలో 2008 నుంచి 2014 వరకు ఈ ఉగ్రవాద సంస్థ వరుసగా 8 ప్రధాన దాడులను నిర్వహించింది. వీటిలో కాష్గర్ దాడి, బీజింగ్ ఒలింపిక్స్కు ముందు దాడి, ఉరుంకి అల్లర్లు, కున్మింగ్ రైల్వే స్టేషన్ దాడి ఉన్నాయి. ఈ దాడుల్లో కనీసం 260 మంది చైనీయులు మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారని పలు నివేదికలు తెలిపాయి. ఆ సమయంలో ఈ దాడులు చైనాలో ప్రకంపనలు సృష్టించాయి. దీని తరువాత చైనా ఉయ్ఘర్ ముస్లింలను నేరుగా తన రాడార్లో ఉంచడం ప్రారంభించింది. సిరియాలో తిరుగుబాటు తర్వాత, తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమ ఉగ్రవాదులు చురుకుగా మారారని జెంగ్ అన్నారు. 2020 డేటా ప్రకారం.. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో 1.7 కోట్ల మంది ఉయ్ఘర్లు ఉన్నారు. అదే సమయంలో సుమారుగా 15 లక్షల మంది ఉయ్ఘర్ ముస్లింలు చైనా పొరుగు ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇక్కడ తిరుగుబాటు జరిగితే అది చైనాకు పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ జిన్జియాంగ్ ప్రావిన్స్ గుండా వెళ్తూ.. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లను చేరుకుంటుంది. ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారితే ఈ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.
READ MORE: ₹1 crore lottery story: ముప్పై రూపాయలతో కోటీశ్వరుడు.. అదృష్టం అంటే ఇదే..!
తాజావార్తలు
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!