China ETIM threat: చైనాను భయపెడుతున్న ఉగ్రసంస్థ.. బీజింగ్ భయానికి కారణాలు ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China ETIM threat: చైనాను ఓ ఉగ్రవాద సంస్థ భయపెడుతుంది. అగ్రరాజ్యం అమెరికాను దాటి ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని చూస్తున్న డ్రాగన్ దేశానికి ఓ ఉగ్రవాద సంస్థ కంట్లో నలుసులా మారింది. బుధవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం అనే ఉగ్రవాద సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని చైనా డిమాండ్ చేసింది. ఓ అంతర్జాతీయ పత్రిక కథనం ప్రకారం.. ఐక్యరాజ్యసమితిలో చైనా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి జెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమానికి చెందిన వేలాది మంది ఉగ్రవాదులు మళ్లీ సిరియాలో చురుకుగా మారారని అన్నారు. వాళ్లందరూ సిరియాలో బలం పెంచుకొని తమ పరిసరాల్లో భయాన్ని వ్యాపింపజేస్తున్నారని అన్నారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఉగ్రవాద సంస్థను ఆపకపోతే మధ్యప్రాచ్యం నుంచి దక్షిణాసియా వరకు ఉన్న దేశాలు నాశనం అవుతాయని హెచ్చరించారు.
READ MORE: Judge Frank Caprio: ఈ జడ్జి చాలా స్పెషల్.. ఇక లేరంటూ కుటుంబం పోస్ట్..
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
ఏంటీ తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం?
1990లో పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్లో హసన్ మహ్మూన్ ఈ తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమాన్ని స్థాపించారు. ఈ ఉగ్రవాద సంస్థ అంతిమ లక్ష్యం తుర్కిస్థాన్ అనే ప్రత్యేక దేశాన్ని సృష్టించడం. విదేశీ సంబంధాల మండలి నివేదికల ప్రకారం.. చైనాలోని ఉయ్ఘర్లకు ప్రత్యేక దేశం ఏర్పాటుకు సహాయం చేయడానికి ఈ ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించిందని పేర్కొన్నాయి. ప్రారంభంలో ఈ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా నుంచి నిధులు పొందేది. 2002లో ప్రపంచం ఈ ఉగ్రవాద సంస్థపై నిషేధం విధించడం ప్రారంభించింది. 2003లో పాకిస్థాన్ సహాయంతో చైనా ఈ ఉగ్రసంస్థ
వ్యవస్థాపకుడు హసన్ మహమూన్ను చంపింది. తర్వాత 2010లో మహమూన్ వారసుడు అబ్దుల్ హక్ను కూడా చంపింది. దీని తర్వాత ఈ సంస్థ తెరవెనుక నుంచి కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించింది. నాటి నుంచి ఈ ఉగ్రసంస్థ అధినాయకుడు ఎవరో ప్రపంచానికి తెలియదు.
ఇప్పటికే చైనాలో ప్రకంపనలు..
చైనాలో 2008 నుంచి 2014 వరకు ఈ ఉగ్రవాద సంస్థ వరుసగా 8 ప్రధాన దాడులను నిర్వహించింది. వీటిలో కాష్గర్ దాడి, బీజింగ్ ఒలింపిక్స్కు ముందు దాడి, ఉరుంకి అల్లర్లు, కున్మింగ్ రైల్వే స్టేషన్ దాడి ఉన్నాయి. ఈ దాడుల్లో కనీసం 260 మంది చైనీయులు మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారని పలు నివేదికలు తెలిపాయి. ఆ సమయంలో ఈ దాడులు చైనాలో ప్రకంపనలు సృష్టించాయి. దీని తరువాత చైనా ఉయ్ఘర్ ముస్లింలను నేరుగా తన రాడార్లో ఉంచడం ప్రారంభించింది. సిరియాలో తిరుగుబాటు తర్వాత, తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమ ఉగ్రవాదులు చురుకుగా మారారని జెంగ్ అన్నారు. 2020 డేటా ప్రకారం.. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో 1.7 కోట్ల మంది ఉయ్ఘర్లు ఉన్నారు. అదే సమయంలో సుమారుగా 15 లక్షల మంది ఉయ్ఘర్ ముస్లింలు చైనా పొరుగు ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇక్కడ తిరుగుబాటు జరిగితే అది చైనాకు పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ జిన్జియాంగ్ ప్రావిన్స్ గుండా వెళ్తూ.. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లను చేరుకుంటుంది. ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారితే ఈ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.
READ MORE: ₹1 crore lottery story: ముప్పై రూపాయలతో కోటీశ్వరుడు.. అదృష్టం అంటే ఇదే..!
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?