China: షాకింగ్ తీర్పు.. ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి మరణశిక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా కోర్టు షాకింగ్ తీర్పు వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులకు మరణశిక్ష విధించింది. ఈ కుటుంబం ఒక క్రిమినల్ ముఠాను నడిపింది. హత్య, మోసం, వ్యభిచారం, మనీలాండరింగ్ లాంటి అనేక తీవ్రమైన నేరాలకు పాల్పడింది. ఈ నేరాలపై విచారణ చేపట్టిన కోర్టు.. వెన్జౌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు మయన్మార్లోని కోకాంగ్లో నివాసం ఉంటున్న మింగ్ గుపింగ్, మింగ్ జెన్జెన్, జౌ వీచాంగ్లతో పాటు మరో ఎనిమిది మందికి మరణశిక్ష విధించింది. కోర్టు మరో ఐదుగురికి రెండేళ్ల సస్పెండ్ మరణశిక్షలు విధించగా, మరో 12 మంది నిందితులకు ఐదు నుంచి 24 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది.
READ MORE: Indian Army Chief Warns Pak: పాకిస్తాన్ ను భూగోళంలో లేకుండా చేస్తాం.. ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
వారు చేసిన నేరాల గురించి తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఈ కుటుంబాన్ని అపఖ్యాతి పాలైన మింగ్ కుటుంబం అని పిలుస్తారు. వీళ్లు 1.4 బిలియన్ డాలర్లకు పైగా విలువైన అక్రమ జూదం వ్యాపారాన్ని నడిపారు. అనేక మంది ఉద్యోగులను హత్య చేయడమే కాకుండా వ్యభిచారంలో పాల్గొనేలా చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. చైనా రాష్ట్ర ప్రసార సంస్థ CCTV ప్రకారం.. 2015 నుంచి మింగ్ కుటుంబం తూర్పు చైనా ప్రావిన్స్ జెజియాంగ్లో భారీ నేర నెట్వర్క్ను నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కుటుంబ ముఠా మయన్మార్లోని కోకాంగ్ ప్రాంతంలో నుంచి అన్ని నేర కార్యకలాపాలను నిర్వహించేవారు. టెలికాం మోసం, అక్రమ క్యాసినో, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి వివిధ నేరాలలో చేశారు. ఈ అక్రమ వ్యాపారాల నుంచి దాదాపు 10 బిలియన్ యువాన్లు అంటే రూ. 12 వేల కోట్లకు పైగా సంపాదించారు.
READ MORE: Avatar 3: ‘అవతార్: స్నీక్ పీక్తో ‘ది వే ఆఫ్ వాటర్’ రీ-రిలీజ్
మింగ్ కుటుంబం చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కాదు.. ఉద్యోగులను విదేశాల నుంచి ఆకర్షించారు. ఇందులో ఎక్కువ మంది చైనా పౌరులు అధికంగా ఉన్నారు. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు తెలుసుకున్న ఉద్యోగులు ఈ స్థావరాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అలాంటి వాళ్లతో మాట్లాడి సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నించారు. మాట వినని వారిని అక్కడే హింసించి చంపేశారు. రెండేళ్ల క్రితం బాధిత కుటుంబీకులు లౌకై ప్రాంతంలోని స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో మింగ్ కుటుంబ పితృస్వామ్యుడు మరణించాడు. తదనంతరం, మింగ్ కుటుంబం చేసిన నేరాలు బయటపడ్డాయి. వారందరినీ చైనా పోలీసులు అరెస్టు చేశారు. కేసు కోర్టు చేరడంతో జెజియాంగ్ కోర్టు ఫిబ్రవరిలో మొదటిసారి కేసును విచారించింది. తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు రావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
-
Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!