China: న్యూ ఇయర్ నుంచి కండోమ్ ధరలు పెంచుతున్న చైనా.. ఎందుకో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: ఈ న్యూ ఇయర్ నుంచి చైనా చాలా మందిని ఆశ్చర్యపరిచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో తెలుసా.. జనవరి 1 నుంచి, డ్రాగన్ దేశంలో కండోమ్లు, గర్భనిరోధకాలపై 13% పన్ను విధిస్తున్నారు. నిజానికి చైనా ఇలా ఎందుకు చేస్తోందో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: RK Roja : బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో ‘ఫైర్ బ్రాండ్’ గ్రాండ్ రీ-ఎంట్రీ!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ప్రస్తుతం చైనా తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధికారిక డేటా ప్రకారం.. 2024లో దేశంలో కేవలం 9.54 మిలియన్ల మంది పిల్లలు మాత్రమే జన్మించారు. ఇది దశాబ్దం క్రితం జననాల సంఖ్యలో దాదాపు సగం. చైనా మొత్తం జనాభా వరుసగా మూడవ సంవత్సరం కూడా తగ్గింది. ఇదే టైంలో దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అలాగే యువకులు వివాహం చేసుకోడానికి, పిల్లలను కనడానికి సుముఖంగా లేరు. ఈ ఆందోళనల మధ్య, ప్రభుత్వం కండోమ్లు, గర్భనిరోధకాలపై పన్నులలో పెద్ద మార్పులు చేసింది. తాజాగా చైనా గర్భనిరోధకాలపై పెద్ద మొత్తంలో పన్ను విధించినా, పిల్లలు, వృద్ధుల సంరక్షణ, వివాహ సంబంధిత సేవలను పన్ను నుంచి మినహాయించారు.
ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యం ఏమిటంటే, యువకులు వివాహం చేసుకుని కుటుంబాలను ప్రారంభించేలా ప్రోత్సహించడమే. అయితే చైనా ప్రజలు ప్రభుత్వ విధానంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్కు గురయ్యింది. ఈ సందర్భంగా చాలా మంది యూజర్స్ పిల్లలను పెంచడానికి అయ్యే ఖర్చు కంటే కండోమ్ల ధర చాలా ఎక్కువ అని కాంమెట్స్ పెడుతున్నారు. చైనాలో పిల్లలను పెంచడం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉద్యోగాలలో ఒకటిగా చెబుతుంటారు. 2024 నివేదిక ప్రకారం.. పిల్లల విద్య, ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు, పోటీ వాతావరణం చైనాలోని కుటుంబాలపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఉద్యోగం, మాతృత్వాన్ని సమర్ధంగా నిర్వహించడం కష్టంగా మారిపోయింది. ఇంకా రియల్ ఎస్టేట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం యువతను వారి భవిష్యత్తు గురించి ఎటు తేల్చుకోనియడం లేదు. వివాహం, పిల్లల కోసం వెళ్లే ముందు చాలామంది యువత ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు.
అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అవాంఛిత గర్భధారణ, లైంగికంగా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని చాలా మంది మహిళలు, సామాజిక కార్యకర్తలు భయపడుతున్నారు. కొంతమంది నిపుణులు ఈ నిర్ణయాన్ని జనాభాను పెంచడానికే కాకుండా, ప్రభుత్వ ఖజానాను నింపే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. చైనా పన్ను ఆదాయంలో ఎక్కువ భాగం వ్యాట్ నుంచి వస్తుంది, ఆర్థిక మాంద్యం సమయంలో, ప్రభుత్వం సాధ్యమయ్యే ప్రతి వనరుల నుంచి ఆదాయాన్ని సేకరించాలని చూస్తుందని చెబుతున్నారు.
READ ALSO: New Year January 1 History: జనవరి 1నే న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!