Fuel From Air: గాలి, నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. ఏం టెక్నాలజీ గురూ..
- పెట్రోల్, డీజిల్ కష్టాలకు చెక్..
- నీరు, గాలి నుంచి ఫ్యూయల్ తయారీ..
- సంచలనం సృష్టించిన చైనా స్టార్టప్ కంపెనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యుద్ధ భయాలు, చమురు సరఫరాలో ఆటంకాలు సామాన్యుడిని వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న గొడవలు, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట సమయంలో చైనాకు చెందిన ‘కార్బోనాలజీ’ అనే కంపెనీ ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. కేవలం గాలి, నీటిని ఉపయోగించి ‘కృత్రిమ ఇంధనాన్ని’ తయారు చేస్తున్నట్లు ప్రకటించింది.
టెస్లా మాజీ అధికారి సారథ్యంలో..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఈ కంపెనీని 2024లో ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ మాజీ వైస్ ప్రెసిడెంట్ స్థాపించారు. ఈయన నేతృత్వంలో గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను నేరుగా సేకరించే ‘డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్’ అనే సరికొత్త పద్ధతిని వీరు వాడుతున్నారు. సాధారణంగా గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను తీసి భూమిలో దాచిపెడతారు.. కానీ వీరు అలా కాకుండా, ఆ వాయువును నేరుగా పెట్రోల్, డీజిల్ వంటి ద్రవ ఇంధనంగా మారుస్తున్నారు.
Also Read:Hormuz Strait Crisis: హర్మూజ్ జలసంధిపై అమెరికా కీలక ప్రకటన..
ఇది ఎలా సాధ్యం…?
సౌర శక్తి లేదా పవన శక్తి వంటి పర్యావరణానికి మేలు చేసే విద్యుత్తును ఉపయోగించి, గాలిలోని కార్బన్ను, నీటిలోని హైడ్రోజన్ను వేరు చేస్తారు. ఆ తర్వాత కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా వీటిని కలిపి ఇంధనంగా మారుస్తారు. ఇది వినడానికి వింతగా ఉన్నా.. ప్రస్తుతానికి షాంఘైలో వీరు ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. విమానాల్లో వాడే ‘జెట్ ఇంధనాన్ని’ కూడా తయారు చేయడం మొదలుపెట్టారు.
చైనా ప్రపంచంలోనే అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశం. గల్ఫ్ దేశాల్లో ఏ చిన్న గొడవ జరిగినా చైనా ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పడుతుంది. అందుకే.. ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండటానికి చైనా ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఒకవేళ ఈ టెక్నాలజీ విజయవంతమైతే, పెట్రోల్ కోసం సౌదీ అరేబియా లేదా రష్యా వైపు చూడాల్సిన అవసరం ఉండదు.
సవాళ్లు ఏమిటి..?
అయితే.. ఈ టెక్నాలజీపై నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు సాధారణ పెట్రోల్ కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే.. ఈ కంపెనీ చెప్పిన విషయాలను ఇంకా బయటి సంస్థలు లేదా శాస్త్రవేత్తలు అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఇది కేవలం ప్రారంభ దశలో మాత్రమే ఉంది. ఇది నిజంగా సామాన్యుడికి అందుబాటులోకి రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. పర్యావరణం వైపు చూస్తే.. ఇది వాహనాల నుంచి వచ్చే పొగను మళ్లీ ఇంధనంగా మార్చే ప్రక్రియ కాబట్టి.. కాలుష్యం తగ్గడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!