Fuel From Air: గాలి, నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. ఏం టెక్నాలజీ గురూ..
- పెట్రోల్, డీజిల్ కష్టాలకు చెక్..
- నీరు, గాలి నుంచి ఫ్యూయల్ తయారీ..
- సంచలనం సృష్టించిన చైనా స్టార్టప్ కంపెనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యుద్ధ భయాలు, చమురు సరఫరాలో ఆటంకాలు సామాన్యుడిని వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న గొడవలు, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట సమయంలో చైనాకు చెందిన ‘కార్బోనాలజీ’ అనే కంపెనీ ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. కేవలం గాలి, నీటిని ఉపయోగించి ‘కృత్రిమ ఇంధనాన్ని’ తయారు చేస్తున్నట్లు ప్రకటించింది.
టెస్లా మాజీ అధికారి సారథ్యంలో..
Also Read
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
ఈ కంపెనీని 2024లో ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ మాజీ వైస్ ప్రెసిడెంట్ స్థాపించారు. ఈయన నేతృత్వంలో గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను నేరుగా సేకరించే ‘డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్’ అనే సరికొత్త పద్ధతిని వీరు వాడుతున్నారు. సాధారణంగా గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను తీసి భూమిలో దాచిపెడతారు.. కానీ వీరు అలా కాకుండా, ఆ వాయువును నేరుగా పెట్రోల్, డీజిల్ వంటి ద్రవ ఇంధనంగా మారుస్తున్నారు.
Also Read:Hormuz Strait Crisis: హర్మూజ్ జలసంధిపై అమెరికా కీలక ప్రకటన..
ఇది ఎలా సాధ్యం…?
సౌర శక్తి లేదా పవన శక్తి వంటి పర్యావరణానికి మేలు చేసే విద్యుత్తును ఉపయోగించి, గాలిలోని కార్బన్ను, నీటిలోని హైడ్రోజన్ను వేరు చేస్తారు. ఆ తర్వాత కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా వీటిని కలిపి ఇంధనంగా మారుస్తారు. ఇది వినడానికి వింతగా ఉన్నా.. ప్రస్తుతానికి షాంఘైలో వీరు ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. విమానాల్లో వాడే ‘జెట్ ఇంధనాన్ని’ కూడా తయారు చేయడం మొదలుపెట్టారు.
చైనా ప్రపంచంలోనే అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశం. గల్ఫ్ దేశాల్లో ఏ చిన్న గొడవ జరిగినా చైనా ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పడుతుంది. అందుకే.. ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండటానికి చైనా ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఒకవేళ ఈ టెక్నాలజీ విజయవంతమైతే, పెట్రోల్ కోసం సౌదీ అరేబియా లేదా రష్యా వైపు చూడాల్సిన అవసరం ఉండదు.
సవాళ్లు ఏమిటి..?
అయితే.. ఈ టెక్నాలజీపై నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు సాధారణ పెట్రోల్ కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే.. ఈ కంపెనీ చెప్పిన విషయాలను ఇంకా బయటి సంస్థలు లేదా శాస్త్రవేత్తలు అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఇది కేవలం ప్రారంభ దశలో మాత్రమే ఉంది. ఇది నిజంగా సామాన్యుడికి అందుబాటులోకి రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. పర్యావరణం వైపు చూస్తే.. ఇది వాహనాల నుంచి వచ్చే పొగను మళ్లీ ఇంధనంగా మార్చే ప్రక్రియ కాబట్టి.. కాలుష్యం తగ్గడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?