Chilli cultivation : మిరపలో తెగుళ్ల నివారణ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పండించే కూరగాయలలో మిర్చి కూడా ఒకటి.. అధిక లాభాలను అందిస్తున్న పంట కావడంతో ఈ పంటను పండించడానికి రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే ఈ పంటకు వాతావరణం బట్టి తెగుళ్లు కూడా ఎక్కువగానే సోకుతాయి.. సరైన సమయంలో చర్యలు తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు.. ఎటువంటి తెగుళ్లు ఆశిస్తాయి.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
నారు కుళ్ళు తెగులు..
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
చిన్న మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతుంది. మొలకెత్తిన వెంటనే ఒకసారి మరలా వారం రోజులకు ఒకసారి మూడు గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.. అప్పుడే కుళ్ళు తెగులు తగ్గుతుంది..
చిగురు కుళ్ళు తెగులు..
ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నారుమళ్ళు మరియు సాలు తోటల్లోనూ ఆశించి మొవ్వు లేదా చిగురు భాగం ఎండిపోతుంది. కాండం పై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి.. ఆకులు ఎండిపోతాయి.. ఈ తెగులు చాలా ప్రమాదం పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి..
తెల్ల నల్లి..
తెల్లనల్లి పురుగులు ఆకుల రసాన్ని పీల్చడం వలన ఆకులు కిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనపడతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారుతాయి.. దీని నివారణ కోసం పంటకు ఒక లీటరు డైనోఫాల్ ను కొట్టడం మంచిది..
తామర పురుగులు..
రెక్కల పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత, పిందె నిలిచిపోతుంది. దీని నివారణకు ఎకరానికి 300 గ్రాములు ఎసిఫేట్ లేదా 400 మిల్లీ లీటర్లు ఫిప్రోనిల్ లేదా స్పైనోశాడ్ 75 మిల్లీ లీటర్లు ఆకులు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాలి..
పేను బంక..
పేనుబంక లేత కొమ్మలు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది. తీయ్యటి పదార్థాన్ని విసర్జించటం వలన చీమల్ని ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు నల్లటి మసిపూసినట్లుగా మారిపోతాయి. నివారణకు ఎకరానికి మిథైల్డెమటాన్ 400 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు చేయాలి. పిల్ల పురుగులు, మొగ్గలు, పూత, పిందెలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.. సరైన సమయంలో దీన్ని కనిపెట్టి నివారణ చర్యలు చేపట్టాలి లేకుంటే తీవ్ర నష్టమే..
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!