Chidambaram Controversy: సొంత పార్టీ ఆగ్రహానికి గురైన చిదంబరం.. ఆపరేషన్ బ్లూ స్టార్పై ఏం మాట్లాడారంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chidambaram Controversy: ఆపరేషన్ బ్లూ స్టార్పై మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ ఆగ్రహానికి గురి చేశాయి. ఆయన వ్యా్ఖ్యలను చాలా మంది కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. చిదంబరం ప్రకటనపై కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వి స్పందిస్తూ .. “ఆపరేషన్ బ్లూ స్టార్ సరైనదా కాదా అనేది వేరే విషయం. కానీ 50 ఏళ్ల తరువాత పి.చిదంబరం ఆపరేషన్ బ్లూ స్టార్కు ఆదేశించి.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై తప్పు చర్య తీసుకున్నారని ఎందుకు చెప్పుకోవాలి” అని ప్రశ్నించారు.
READ ALSO: Durgapur Gang Rape: బెంగాల్లో మాకు రక్షణ లేదు, ఒడిశా వెళ్తాం: గ్యాంగ్ రేప్ బాధితురాలి తండ్రి..
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
చిదంబరం ఏమన్నారంటే..
కసౌలిలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో చిదంబరం మాట్లాడుతూ.. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ను పంజాబ్లోని స్వర్ణ దేవాలయంపై జరిగిన తప్పుడు ఆపరేషన్గా అభివర్ణించారు. ఈ నిర్ణయానికి మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. “నేను ఏ సైనిక అధికారిని అగౌరవపరచడం లేదు, కానీ స్వర్ణ దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది తప్పు మార్గం. కొన్నేళ్ల తరువాత, సైన్యాన్ని దూరంగా ఉంచడం ద్వారా దానిని తీసుకోవడానికి సరైన మార్గాన్ని మేము సూచించాము. బ్లూ స్టార్ తప్పుడు మార్గం, ఇందిరా గాంధీ ఆ తప్పుకు తన ప్రాణాలతో మూల్యం చెల్లించుకున్నారని నేను నమ్ముతున్నాను” అని అన్నారు.
ఏదైనా ఒత్తిడి ఉందా?..
బీజేపీ, ప్రధానమంత్రి చేసినట్లే చిదంబరం కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నానని రషీద్ అల్వి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై చిదంబరం పదే పదే చేస్తున్న దాడులు అనేక సందేహాలను, భయాలను రేకెత్తిస్తుండటం దురదృష్టకరం అని చెప్పారు. ఆయనపై ఇంకా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని అల్వి ఎత్తి చూపారు. “కాంగ్రెస్ పార్టీపై దాడి చేయడం కొనసాగించడానికి ఆయనపై ఏదైనా ఒత్తిడి ఉందా అని ఆశ్చర్యపోతున్నాను? బ్లూ స్టార్కు ఇందిరా గాంధీ కారణమని, దాని కోసం తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని నేడు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గత 11 ఏళ్లుగా బీజేపీ లోపాలను బహిర్గతం చేయడానికి బదులుగా చిదంబరం ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. బీజేపీ మొత్తం దేశాన్ని ఎలా నాశనం చేస్తుందో వివరించడానికి బదులుగా, ఆయన కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తి చూపుతున్నారు” అని విమర్శించారు.
READ ALSO: Saudi Arabia Military Support: పాక్ – ఆఫ్ఘన్ యుద్ధంలోకి సౌదీ అరేబియా ఎంట్రీ ఇస్తుందా?
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!