Chhattisgarh : పేలుడు జరిగి 36 గంటలు గడిచినా.. లభించని ఎనిమిది మంది కూలీల ఆచూకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని బెమెతర జిల్లా బెర్లా బ్లాక్లోని పిర్దా గ్రామంలోని గన్పౌడర్ ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు చాలా తీవ్రంగా ఉంది. దాని ప్రతిధ్వని ఐదు కిలోమీటర్ల వరకు వినిపించింది. ఒక కిలోమీటరు మేర భూమి కంపించింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు. ప్రమాదం తర్వాత ఇప్పటివరకు ఎనిమిది మంది గల్లంతైనట్లు నిర్ధారించారు. ఘటనా స్థలానికి ఆర్మీకి చెందిన పేలుడు దర్యాప్తు యూనిట్ను రప్పించారు.
గల్లంతైన వారి గురించి పోలీసులకు సమాచారం అందించినట్లు బేమెతర ఎస్పీ రామకృష్ణ తెలిపారు. వారందరి కుటుంబ సభ్యులను సంఘటనా స్థలానికి రప్పించారు. పేలుడు జరిగి దాదాపు 24 గంటలు గడిచినా 8 మంది మృతి చెందినట్లు ఎలాంటి సమాచారం లేదు. ఘటనా స్థలంలో 12 జేసీబీలు, పెద్ద హైడ్రాలిక్ మిషన్తో తవ్వకాలు జరుపుతున్నారు. గల్లంతైన వారి బంధువులు ఘటనా స్థలంలో బీభత్సం సృష్టించారు.
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
- Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
Read Also:Pinnelli Ramakrishna Reddy: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి మరో ముందస్తు బెయిల్ పిటిషన్..
బెమెత్రా జిల్లా పిర్దా గ్రామంలోని స్పెషల్ బ్లాస్ట్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. గన్పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన చోట 30 అడుగుల లోతున బిలం ఏర్పడింది. పేలుడు శబ్ధం దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వినిపించింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఎనిమిది మంది సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే అనితా శర్మ, సుబోధ్ హరిత్వాల్, మహేంద్ర ఛబ్రా, మాజీ ఎమ్మెల్యే ఆశిష్ ఛబ్రా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన చాలా పెద్దదని మాజీ ఎమ్మెల్యే అనితాశర్మ అన్నారు. గన్పౌడర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనిపై న్యాయ విచారణ జరిపి మృతదేహాలను వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు.
ఘటనా స్థలంలో కొందరి మానవ శరీర భాగాలు లభించాయని, అయితే అవి ఎవరికి చెందినవో చెప్పడం కష్టమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేశారు. జిల్లా మేజిస్ట్రేట్ రణబీర్ శర్మ ఆదేశాల మేరకు, తప్పిపోయిన కార్మికులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఒక్కొక్కరికి రూ.10 లక్షల సాయం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెక్కులను వెంటనే అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని డీఎన్ఏ పరీక్ష తర్వాత అందజేస్తామని రణ్బీర్ శర్మ తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో కనీసం 100 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం.
Read Also:LPG Price : జూన్ 4న ఫలితాల తర్వాత భారీగా పెరగనున్న ఎల్పీజీ సిలిండర్ ధరలు ?
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!