Chhattisgarh : పేలుడు జరిగి 36 గంటలు గడిచినా.. లభించని ఎనిమిది మంది కూలీల ఆచూకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని బెమెతర జిల్లా బెర్లా బ్లాక్లోని పిర్దా గ్రామంలోని గన్పౌడర్ ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు చాలా తీవ్రంగా ఉంది. దాని ప్రతిధ్వని ఐదు కిలోమీటర్ల వరకు వినిపించింది. ఒక కిలోమీటరు మేర భూమి కంపించింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు. ప్రమాదం తర్వాత ఇప్పటివరకు ఎనిమిది మంది గల్లంతైనట్లు నిర్ధారించారు. ఘటనా స్థలానికి ఆర్మీకి చెందిన పేలుడు దర్యాప్తు యూనిట్ను రప్పించారు.
గల్లంతైన వారి గురించి పోలీసులకు సమాచారం అందించినట్లు బేమెతర ఎస్పీ రామకృష్ణ తెలిపారు. వారందరి కుటుంబ సభ్యులను సంఘటనా స్థలానికి రప్పించారు. పేలుడు జరిగి దాదాపు 24 గంటలు గడిచినా 8 మంది మృతి చెందినట్లు ఎలాంటి సమాచారం లేదు. ఘటనా స్థలంలో 12 జేసీబీలు, పెద్ద హైడ్రాలిక్ మిషన్తో తవ్వకాలు జరుపుతున్నారు. గల్లంతైన వారి బంధువులు ఘటనా స్థలంలో బీభత్సం సృష్టించారు.
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
Read Also:Pinnelli Ramakrishna Reddy: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి మరో ముందస్తు బెయిల్ పిటిషన్..
బెమెత్రా జిల్లా పిర్దా గ్రామంలోని స్పెషల్ బ్లాస్ట్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. గన్పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన చోట 30 అడుగుల లోతున బిలం ఏర్పడింది. పేలుడు శబ్ధం దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వినిపించింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఎనిమిది మంది సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే అనితా శర్మ, సుబోధ్ హరిత్వాల్, మహేంద్ర ఛబ్రా, మాజీ ఎమ్మెల్యే ఆశిష్ ఛబ్రా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన చాలా పెద్దదని మాజీ ఎమ్మెల్యే అనితాశర్మ అన్నారు. గన్పౌడర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనిపై న్యాయ విచారణ జరిపి మృతదేహాలను వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు.
ఘటనా స్థలంలో కొందరి మానవ శరీర భాగాలు లభించాయని, అయితే అవి ఎవరికి చెందినవో చెప్పడం కష్టమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేశారు. జిల్లా మేజిస్ట్రేట్ రణబీర్ శర్మ ఆదేశాల మేరకు, తప్పిపోయిన కార్మికులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఒక్కొక్కరికి రూ.10 లక్షల సాయం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెక్కులను వెంటనే అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని డీఎన్ఏ పరీక్ష తర్వాత అందజేస్తామని రణ్బీర్ శర్మ తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో కనీసం 100 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం.
Read Also:LPG Price : జూన్ 4న ఫలితాల తర్వాత భారీగా పెరగనున్న ఎల్పీజీ సిలిండర్ ధరలు ?
తాజావార్తలు
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..