Chevireddy Bhaskar Reddy: జైలు వద్ద ఆగని చెవిరెడ్డి హంగామా.. మూల్యం తప్పదు అంటూ..!
- జైలు వద్ద ఆగని చెవిరెడ్డి హంగామా
- సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారన్న చెవిరెడ్డి
- ఏదొకరోజు తప్పకుండా శిక్ష పడుతుందన్న చెవిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విజయవాడ సబ్ జైలు వద్ద మరోసారి హంగామా సృష్టించారు. ఇప్పటికే రెండు రోజులు జైలు వద్ద చెవిరెడ్డి హంగామా చేయగా.. నేడు కూడా రచ్చ చేశారు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో సిట్ దర్యాప్తుపై చెవిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అవి నిలబడవన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారికి ఏదొకరోజు తప్పకుండా శిక్ష పడుతుందంటూ చెవిరెడ్డి పోలీసు వ్యాన్ ఎక్కారు.
రెండోరోజు జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరుస్తూ వెళ్లారు. తప్పులు చేసే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. చెవిరెడ్డి మొదటి రోజు కూడా వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి తనను అన్యాయంగా జైలుకి పంపారని, దేవుడు అన్నీ చూస్తున్నాడన్నారు. అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్న వారిని ఆ దేవుడు శిక్షిస్తాడని, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని చెవిరెడ్డి అన్నారు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో మూడు రోజులు చెవిరెడ్డి హంగామా చేశారు.
Also Read
- Arunachal Pradesh: అరుణాచల్లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
- Babar Azam: ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
- Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
Also Read: Fire Accident: గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం!
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ38గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. చెవిరెడ్డిని మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించాలని ఆదేశాల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. చెవిరెడ్డిని ఈరోజు మూడో రోజు కస్టడీలోకి సిట్ అధికారులు తీసుకున్నారు. రెండు రోజుల విచారణలో చెవిరెడ్డి సహకరించలేదని సిట్ చెబుతోంది. నేటితో కస్టడీ ముగియనున్న నేపద్యంలో సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు చుస్తున్నారు.
తాజావార్తలు
-
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
-
Arunachal Pradesh: అరుణాచల్లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
-
Babar Azam: ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!