Uttarakhand : ఉత్తరాఖండ్లో భారీ వర్షం హెచ్చరిక.. ఎల్లో అలర్ట్ జారీ.. ఛార్ధామ్ యాత్ర వద్దని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand : ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం కారణంగా చార్ధామ్ యాత్రను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ కేంద్రం ఈ విషయాన్ని చెప్పింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ చోట్ల కొండచరియలు విరిగిపడడంతోపాటు పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చార్ ధామ్ తీర్థయాత్రకు వెళ్లే ప్రజలు వాతావరణ వినాశనాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో భక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డెహ్రాడూన్, ఉధమ్సింగ్ నగర్, చంపావత్, నైనిటాల్, హరిద్వార్, కేదార్నాథ్లలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు పలుచోట్ల తుపాను, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
Read Also:Sudheer babu: హరోం హర ఓటీటీ విడుదల వాయిదా..?
Also Read
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
మూసుకుపోయిన 70కి పైగా రోడ్లు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో 70కి పైగా రహదారులు మూసుకుపోయాయి. మంగళ, బుధవారాల్లో 200కు పైగా రూట్లు దెబ్బతిన్నాయి. అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వీటిలో చాలా రహదారులు గురువారం తెరవబడ్డాయి. బద్రీనాథ్ జాతీయ రహదారిపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడిన చిత్రాలు బుధవారం కూడా కనిపించాయి. పాతాళగంగ లాంగ్సీ టన్నెల్ సమీపంలో ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం కొండచరియలు విరిగిపడటంతో పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. అయితే వర్షం ఎల్లో అలర్ట్ కారణంగా చార్ ధామ్ యాత్రను కొంత కాలం పాటు వాయిదా వేయాలని వాతావరణ శాఖ భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఎలాంటి పెద్ద ప్రమాదం జరగకుండా ఈ తరహా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు ఆలయానికి చేరుకోవడంలో ఆలస్యం కావచ్చు, కానీ వారు సురక్షితంగా ఉంటారు.
Read Also:Shubman Gill Trolls: శుభ్మన్ గిల్ సెల్ఫిష్ కెప్టెన్.. టీ20లకు పనికిరాడు!
తాజావార్తలు
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!