Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Chandrababu Teleconference With Tdp Cadre Key Instructions For Leaders

Chandrababu: టీడీపీ కేడర్‌తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. పింఛన్లపై కీలక ప్రకటన

Published Date :April 1, 2024 , 3:58 pm
By Mahesh Jakki
Chandrababu: టీడీపీ కేడర్‌తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. పింఛన్లపై కీలక ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chandrababu: పెన్షన్ల అంశంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఇంటింటి ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు పార్టీ కేడరుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వ కుట్రలు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. తన రాజకీయ లబ్ది కోసం బాబాయినే చంపేసిన జగన్.. ఓట్ల కోసం ఇలాంటి అనేక కుట్రలు చేస్తాడని ఆరోపించారు. మనం వచ్చాక రూ. 4 వేల పెన్షన్ ఇంటింటికీ ఇస్తామని.. రెండు మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తామని.. అన్ని విషయాలు లబ్దిదారులకు వివరించాలన్నారు. ప్రభుత్వం గత 15 రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత బిల్లులు ఇచ్చిందో ప్రకటన చెయ్యాలన్నారు. మే 13 తరువాత ఇంటికి పోయే ముందు ఖజానాలో ఉన్న డబ్బంతా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని.. గత 15 రోజుల్లో రూ. 13 వేల కోట్లు బిల్లుల కోసం చెల్లింపులు జరిపారని.. పేదలకిచ్చే డబ్బులు విషయంలో జగన్ నాటకాలు ఆడుతున్నాడని చంద్రబాబు విమర్శించారు.

Read Also: Prasanna Kumar Reddy: సీఎంగా జగన్‌ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..

ఇంటింటికీ పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని కేడర్‌కు సూచించారు. ప్రజాగళం సభల స్పందన మిత్ర పక్షాల గెలుపునకు సూచకమన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అనే బలమైన భావన, కసి ప్రజల్లో కనిపిస్తుందన్నారు. జగనుకు వచ్చే ఎన్నికల్లో తన ఓటమి అర్థం అయ్యింది.. అందుకే ఫేక్ ప్రచారాలను పెంచాడన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ కుట్ర రాజకీయాల స్పీడు పెంచాడని తీవ్రంగా విమర్శించారు. పెన్షన్లపై ప్రభుత్వ అబద్దాలు, తప్పుడు ప్రచారాలు జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. 1వ తేదీ ఇంటి వద్దనే పెన్షన్ అందించే విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వృద్దులు, వికలాంగులకు పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వాలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్నందునే సీఈసీ వారిని విధులకు దూరం పెట్టిందన్నారు. పెన్షన్లు పంపిణీ చేయొద్దని తెలుగు దేశం ఎవరినీ కోరలేదు.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పలేదన్నారు.

Read Also: Janga Krishna Murthy Quits YSRCP: వైసీపీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గుడ్‌బై.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

1.35 లక్షల మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు.. వారి ద్వారా ఒక్క రోజులో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇవ్వొచ్చన్నారు. ప్రభుత్వ పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు.. సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. ఖజానా ఖాళీ చేసి పెన్షన్ ఇవ్వలేకపోయిన ప్రభుత్వం.. ఆ నెపాన్ని మనపై, ఎన్నికల సంఘంపై నెడుతోందన్నారు. వాలంటీర్ల విషయంలో మనం స్పష్టంగా ఉన్నామని.. వైసీపీ కోసం వాలంటీర్లు పని చేయొద్దని సూచించారు. వాలంటీర్ల భవిష్యత్ తమదే అని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు ఎన్నికల వేళ తప్పులు చేస్తే వారిపైనా కేసులు పడే అవకాశం ఉంది.. వాళ్లూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్ రాజకీయ క్రీడలో వాలంటీర్ల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. తన రాజకీయ లబ్ది కోసం నడి వేసవిలో వృద్దులను, వికలాంగులను కూడా జగన్ ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్నాడని చంద్రబాబు అన్నారు. గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు ఇంటింటికీ పెన్షన్ ఇవ్వలేకపోతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • AP Pensions
  • chandrababu
  • tdp

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions