Chandrababu: టీడీపీ కేడర్తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. పింఛన్లపై కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: పెన్షన్ల అంశంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఇంటింటి ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు పార్టీ కేడరుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వ కుట్రలు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. తన రాజకీయ లబ్ది కోసం బాబాయినే చంపేసిన జగన్.. ఓట్ల కోసం ఇలాంటి అనేక కుట్రలు చేస్తాడని ఆరోపించారు. మనం వచ్చాక రూ. 4 వేల పెన్షన్ ఇంటింటికీ ఇస్తామని.. రెండు మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తామని.. అన్ని విషయాలు లబ్దిదారులకు వివరించాలన్నారు. ప్రభుత్వం గత 15 రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత బిల్లులు ఇచ్చిందో ప్రకటన చెయ్యాలన్నారు. మే 13 తరువాత ఇంటికి పోయే ముందు ఖజానాలో ఉన్న డబ్బంతా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని.. గత 15 రోజుల్లో రూ. 13 వేల కోట్లు బిల్లుల కోసం చెల్లింపులు జరిపారని.. పేదలకిచ్చే డబ్బులు విషయంలో జగన్ నాటకాలు ఆడుతున్నాడని చంద్రబాబు విమర్శించారు.
Read Also: Prasanna Kumar Reddy: సీఎంగా జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు..
Also Read
ఇంటింటికీ పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని కేడర్కు సూచించారు. ప్రజాగళం సభల స్పందన మిత్ర పక్షాల గెలుపునకు సూచకమన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అనే బలమైన భావన, కసి ప్రజల్లో కనిపిస్తుందన్నారు. జగనుకు వచ్చే ఎన్నికల్లో తన ఓటమి అర్థం అయ్యింది.. అందుకే ఫేక్ ప్రచారాలను పెంచాడన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ కుట్ర రాజకీయాల స్పీడు పెంచాడని తీవ్రంగా విమర్శించారు. పెన్షన్లపై ప్రభుత్వ అబద్దాలు, తప్పుడు ప్రచారాలు జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. 1వ తేదీ ఇంటి వద్దనే పెన్షన్ అందించే విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వృద్దులు, వికలాంగులకు పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వాలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్నందునే సీఈసీ వారిని విధులకు దూరం పెట్టిందన్నారు. పెన్షన్లు పంపిణీ చేయొద్దని తెలుగు దేశం ఎవరినీ కోరలేదు.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పలేదన్నారు.
1.35 లక్షల మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు.. వారి ద్వారా ఒక్క రోజులో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇవ్వొచ్చన్నారు. ప్రభుత్వ పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు.. సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. ఖజానా ఖాళీ చేసి పెన్షన్ ఇవ్వలేకపోయిన ప్రభుత్వం.. ఆ నెపాన్ని మనపై, ఎన్నికల సంఘంపై నెడుతోందన్నారు. వాలంటీర్ల విషయంలో మనం స్పష్టంగా ఉన్నామని.. వైసీపీ కోసం వాలంటీర్లు పని చేయొద్దని సూచించారు. వాలంటీర్ల భవిష్యత్ తమదే అని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు ఎన్నికల వేళ తప్పులు చేస్తే వారిపైనా కేసులు పడే అవకాశం ఉంది.. వాళ్లూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్ రాజకీయ క్రీడలో వాలంటీర్ల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. తన రాజకీయ లబ్ది కోసం నడి వేసవిలో వృద్దులను, వికలాంగులను కూడా జగన్ ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్నాడని చంద్రబాబు అన్నారు. గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు ఇంటింటికీ పెన్షన్ ఇవ్వలేకపోతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
తాజావార్తలు
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
-
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
-
Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!