Chandrababu Quash Petition: చంద్రబాబుకు హైకోర్టు షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Quash Petition: టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది.. క్వాష్ పిటిషన్ డిస్మిస్డ్ అంటూ ఏకవాక్యం చెప్పి వెళ్లిపోయారు హైకోర్టు న్యాయమూర్తి.. దీంతో, చంద్రబాబుకు హైకోర్టులో కూడా ఊరట దక్కకుండా పోయింది.. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై వాదనల సందర్భంగా సీఐడీ తరఫు లాయర్ల వినిపించిన వాదనలతో ఏకీభవించింది హైకోర్టు.. ఇక, క్వాష్ పిటిషన్పై హైకోర్టు తేల్చేయడంతో.. చంద్రబాబు కస్టడీ పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది.. చంద్రబాబు కస్టడీ పిటిషన్పై కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది.. క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు కోసమే వేచి చూస్తూ వచ్చింది ఏసీబీ కోర్టు.. క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో.. ఏసీబీ కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్ను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించిన విషయం విదితమే.. చంద్రబాబు రిమాండ్ రెండు రోజులు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు..
Also Read
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
చంద్రబాబు కస్టడీ పిటిషన్పై మధ్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.. దీనికి సంబంధించిన పూర్తి జడ్జిమెంట్ త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది.. అసలు కేసే చెల్లదన్న చంద్రబాబు లాయర్ల వాదనను హైకోర్టు తిరస్కరించినట్టు అయ్యింది.. 17 ఏ సెక్షన్ కింద అరెస్ట్ చెల్లదన్న వాదనను అంగీకరించలేదు హైకోర్టు.. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ వాదనలతో ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించింది.. ఈ సందర్భంగా సీఐడీ తరఫు లాయర్ల మాట్లాడుతూ.. ఈ కేసులో దర్యాప్తులో నిజనిజాలు తేలుతాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రీ మెచ్యూర్ మాత్రమే నని.. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు పక్కాగా ఉందని చెబుతున్నారు.. ఈ కేసులో తీగ లాగిన కొద్దీ మరెన్నో కోణాలు బయటపడే అవకాశ ఉందని.. ఇక్కడ ఉన్న వారితో పాటు జర్మనీలో ఉన్న సీమెన్స్ కంపెనీ వాళ్లను కూడా సంప్రదించాలి.. ప్రభుత్వ ధనం ఎక్కడికెళ్లిందన్నది తేల్చాల్సిందే, ఖజానాకు కట్టాల్సిందేనని.. ఆధారాలు ఉండడంతో హైకోర్టు క్వాష్ పిటిషన్ను తిరస్కరించిందని అంటున్నారు సీఐడీ తరఫు లాయర్లు.
తాజావార్తలు
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!