Census: 2025లో జనాభా లెక్కలు.. 2028 నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన!
- 2025లో ప్రారంభం కానున్న జనాభా లెక్కలు
- 2028 నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన
- వెల్లడించిన ప్రభుత్వ వర్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Census: నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ఆలస్యం తర్వాత 2025లో దేశ జనాభాకు సంబంధించిన అధికారిక సర్వే అయిన జనాభా గణనను ప్రభుత్వం ప్రారంభించనుందని సోమవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. జనాభా లెక్కల అనంతరం లోక్సభ స్థానాల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2028 నాటికి ఈ కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కుల గణన కోసం పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే, ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జనాభా గణన ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇంకా బహిరంగపరచలేదు.
Read Also: Minister Ponnam Prabhakar: మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
Also Read
- NALSAR Row: నల్సార్ వివాదం.. లా స్టూడెంట్స్కు BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణ..
- CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
- Gen Z Lifestyle: 'జెన్ జీ' లైఫ్స్టైల్ వెనుక అసలు నిజం.. టూర్లు కావు.. 70% డబ్బు దేనికి పోతోందో తెలుసా..?
- Vishal Garg: ఒక్క వీడియో కాల్తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR)ని అప్డేట్ చేయడానికి సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా గణన 2021కి షెడ్యూల్ చేయబడింది, అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు, జనాభా లెక్కల చక్రం కూడా మారుతుందని భావిస్తున్నారు. రాబోయే జనాభా గణన రౌండ్లో సాధారణ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల గణనలతో పాటు మతం, సామాజిక తరగతిపై సాధారణ సర్వేలు ఉంటాయి. అయితే, వచ్చే ఏడాది జనాభా లెక్కలు జనరల్ మరియు SC-ST కేటగిరీలలోని ఉప-వర్గాలను కూడా సర్వే చేయవచ్చని వర్గాలు సూచిస్తున్నాయి.
చాలా ఆలస్యం అయిన జనాభా గణన ప్రక్రియల తక్షణ ప్రారంభాన్ని సూచిస్తూ, ప్రస్తుతం రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్న మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ యొక్క సెంట్రల్ డిప్యుటేషన్ ఇటీవల ఆగస్టు 2026 వరకు పొడిగించబడింది. జనగణన గురించి ఆగస్టులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అది తగిన సమయంలో నిర్వహించబడుతుందని చెప్పారు. నిర్ణయం తీసుకున్న తర్వాత, అది ఎలా జరుగుతుందో ప్రకటిస్తానని చెప్పారు. తదుపరి జాతీయ జనాభా గణనను మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా పూర్తిగా డిజిటల్గా నిర్వహిస్తామని కూడా అమిత్ షా పేర్కొన్నారు. గత జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 121 కోట్లకు పైగా జనాభా నమోదైంది, ఇది 17.7 శాతం వృద్ధి రేటును ప్రతిబింబిస్తుంది.
తాజావార్తలు
-
NALSAR Row: నల్సార్ వివాదం.. లా స్టూడెంట్స్కు BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణ..
-
Aasmaan : గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్!
-
Suriya: ‘‘ఈ సక్సెస్ను నంబర్లతో కొలవలేం’’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ఎమోషనల్ కామెంట్స్!
-
CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
-
Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!