Census: 2025లో జనాభా లెక్కలు.. 2028 నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన!
- 2025లో ప్రారంభం కానున్న జనాభా లెక్కలు
- 2028 నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన
- వెల్లడించిన ప్రభుత్వ వర్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Census: నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ఆలస్యం తర్వాత 2025లో దేశ జనాభాకు సంబంధించిన అధికారిక సర్వే అయిన జనాభా గణనను ప్రభుత్వం ప్రారంభించనుందని సోమవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. జనాభా లెక్కల అనంతరం లోక్సభ స్థానాల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2028 నాటికి ఈ కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కుల గణన కోసం పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే, ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జనాభా గణన ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇంకా బహిరంగపరచలేదు.
Read Also: Minister Ponnam Prabhakar: మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
Also Read
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
- FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR)ని అప్డేట్ చేయడానికి సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా గణన 2021కి షెడ్యూల్ చేయబడింది, అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు, జనాభా లెక్కల చక్రం కూడా మారుతుందని భావిస్తున్నారు. రాబోయే జనాభా గణన రౌండ్లో సాధారణ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల గణనలతో పాటు మతం, సామాజిక తరగతిపై సాధారణ సర్వేలు ఉంటాయి. అయితే, వచ్చే ఏడాది జనాభా లెక్కలు జనరల్ మరియు SC-ST కేటగిరీలలోని ఉప-వర్గాలను కూడా సర్వే చేయవచ్చని వర్గాలు సూచిస్తున్నాయి.
చాలా ఆలస్యం అయిన జనాభా గణన ప్రక్రియల తక్షణ ప్రారంభాన్ని సూచిస్తూ, ప్రస్తుతం రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్న మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ యొక్క సెంట్రల్ డిప్యుటేషన్ ఇటీవల ఆగస్టు 2026 వరకు పొడిగించబడింది. జనగణన గురించి ఆగస్టులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అది తగిన సమయంలో నిర్వహించబడుతుందని చెప్పారు. నిర్ణయం తీసుకున్న తర్వాత, అది ఎలా జరుగుతుందో ప్రకటిస్తానని చెప్పారు. తదుపరి జాతీయ జనాభా గణనను మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా పూర్తిగా డిజిటల్గా నిర్వహిస్తామని కూడా అమిత్ షా పేర్కొన్నారు. గత జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 121 కోట్లకు పైగా జనాభా నమోదైంది, ఇది 17.7 శాతం వృద్ధి రేటును ప్రతిబింబిస్తుంది.
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!