Kishan Reddy: ఏపీలో ప్రధాన ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు భారీగా నిధులు మంజూరు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మేయర్ భాగ్యలక్ష్మి, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. దుర్గమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాను.. అమ్మవారిని ప్రపంచంలో అనేక రకాలుగా వాతావారణం, అనుకూలం లేని పరిస్దితులు, కరోనా నుండి బయటపడ్డాం మరలా ఇలాంటి పరిస్థితులు రాకుడదని కోరుకున్నానన్నారు.
Read Also: MP Margani Bharat: శభాష్ భరత్.. గోదావరిలో దూకబోయిన యువకుడిని కాపాడిన ఎంపీ
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని కోరుకున్నాను..గతంలో వృద్ధులు మాత్రమే దేవాలయాలకు వచ్చేవారు నేడు యువతంతా దేవాలయాలకు వస్తున్నారు.అమ్మవారు సమస్త ప్రజలను దయతో చూడాలని కోరుకున్నా.. ప్రసాద్ టూరిజం లో భాగంగా అమరావతికి వచ్చే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాం..అన్నవరం, సింహాచలం, నెల్లూరు లక్ష్మి నరసింహ దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాం..దేశంలో 156 దేవాలయాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకు అభివృద్ధి చేస్తున్నాం. ఘంటశాల శతాబ్ది ఉత్సవాలు రాజమండ్రిలో నిర్వహించాం. విజయవాడలో త్వరలో నిర్వహిస్తాం అన్నారు కిషన్ రెడ్డి.

ఇటు ధర్మవరం నుంచి విజయవాడ నడుస్తున్న రైలు నం. 17216 ను మచిలీపట్నం వరకు పొడిగించాలని నిర్ణయించింది రైల్వేశాఖ. విజయవాడ రైల్వే జంక్షన్ లో ధర్మవరం -మచిలీపట్నం రైలును జండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడ రైల్వే స్టేషన్ ను ఎయిర్ పోర్ట్ లా ఆధునీకరించబోతున్నాం. రాజమండ్రి, గూడూరు రైల్వేస్టేషన్ లను త్వరలో ఎయిర్ పోర్ట్ లా ఆధునీకరిస్తామన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు రైళ్లలో వచ్చే ప్రయాణికులు ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారి కోసం చర్లపల్లి వద్ద కొత్త రైల్వే టర్మీనల్ ను నిర్మిస్తున్నాం అన్నారు. వచ్చే డిసెంబర్ లోపల 100 వందేభారత రైళ్లను తీసుకొస్తామని చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
Read Also: A village without TV: ఆ ఊరిలో ఏ ఇంట్లోనూ టీవీ ఉండదు
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!