Kishan Reddy: ఏపీలో ప్రధాన ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు భారీగా నిధులు మంజూరు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మేయర్ భాగ్యలక్ష్మి, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. దుర్గమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాను.. అమ్మవారిని ప్రపంచంలో అనేక రకాలుగా వాతావారణం, అనుకూలం లేని పరిస్దితులు, కరోనా నుండి బయటపడ్డాం మరలా ఇలాంటి పరిస్థితులు రాకుడదని కోరుకున్నానన్నారు.
Read Also: MP Margani Bharat: శభాష్ భరత్.. గోదావరిలో దూకబోయిన యువకుడిని కాపాడిన ఎంపీ
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని కోరుకున్నాను..గతంలో వృద్ధులు మాత్రమే దేవాలయాలకు వచ్చేవారు నేడు యువతంతా దేవాలయాలకు వస్తున్నారు.అమ్మవారు సమస్త ప్రజలను దయతో చూడాలని కోరుకున్నా.. ప్రసాద్ టూరిజం లో భాగంగా అమరావతికి వచ్చే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాం..అన్నవరం, సింహాచలం, నెల్లూరు లక్ష్మి నరసింహ దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాం..దేశంలో 156 దేవాలయాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకు అభివృద్ధి చేస్తున్నాం. ఘంటశాల శతాబ్ది ఉత్సవాలు రాజమండ్రిలో నిర్వహించాం. విజయవాడలో త్వరలో నిర్వహిస్తాం అన్నారు కిషన్ రెడ్డి.

ఇటు ధర్మవరం నుంచి విజయవాడ నడుస్తున్న రైలు నం. 17216 ను మచిలీపట్నం వరకు పొడిగించాలని నిర్ణయించింది రైల్వేశాఖ. విజయవాడ రైల్వే జంక్షన్ లో ధర్మవరం -మచిలీపట్నం రైలును జండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడ రైల్వే స్టేషన్ ను ఎయిర్ పోర్ట్ లా ఆధునీకరించబోతున్నాం. రాజమండ్రి, గూడూరు రైల్వేస్టేషన్ లను త్వరలో ఎయిర్ పోర్ట్ లా ఆధునీకరిస్తామన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు రైళ్లలో వచ్చే ప్రయాణికులు ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారి కోసం చర్లపల్లి వద్ద కొత్త రైల్వే టర్మీనల్ ను నిర్మిస్తున్నాం అన్నారు. వచ్చే డిసెంబర్ లోపల 100 వందేభారత రైళ్లను తీసుకొస్తామని చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
Read Also: A village without TV: ఆ ఊరిలో ఏ ఇంట్లోనూ టీవీ ఉండదు
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!