Mobile Towers: మాకు సెల్ ఫోన్ టవర్స్ వద్దు.. పక్షులే ముద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగిపోతుంది. అందుకు అనుగుణంగా ప్రజలు సైతం తమ జీవనశైలీని మార్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. వాటికి సరిగ్గా సిగ్నల్ కోసం ఏర్పాటు చేసే సెల్ ఫోన్ టవర్స్.. ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేస్తుంటారు. అయితే, సెల్ ఫోన్ టవర్స్ నుంచి ప్రమాదకర రేడియేషన్ వెలువడుతుందని.. పరిసర ప్రాంతాల ప్రజల హెల్త్ పై అది ఎఫెక్ట్ చూపిస్తుందని అనేక నివేదికలు వచ్చాయి. ఇలాంటి కారణాలతో సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటును స్థానికులు అడ్డుకున్న ఘటనలను మనం చాలానే చూశాం. కానీ తాజాగా జరిగిన ఒక ఘటన వెరైటీగా ఉంది.
Read Also: CM KCR: మహారాష్ట్రపై సీఎం కేసీఆర్ ఫోకస్.. వచ్చే నెల 1న పర్యటన
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా లచ్కెరా గ్రామస్తులు తమ విలేజ్ లో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటును అడ్డుకున్నారు. తమకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అక్కర లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. ఊరిలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటుకు ఏ కంపెనీ వచ్చినా అడ్డుకుంటామని క్లారిటీ ఇచ్చారు. వాళ్ళ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక స్వార్ధం లేదు.. తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలనే తాపత్రయం లేదు.. లచ్కెరా గ్రామంలోకి వలస వచ్చే పక్షుల గురించి మాత్రమే వారు ఆలోచించారు.
Read Also: Osmania University: సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు.. ఓయూలో విద్యార్థుల ఆందోళన..
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చైనా, థాయ్ లాండ్, బర్మా, ఇండోనేషియా నుంచి ఈ గ్రామానికి వందలాది ఏషియన్ ఓపెన్బిల్ జాతి కొంగలు వలస వస్తుంటాయి. లచ్కెరా గ్రామంలోని చెట్లపై ఈ కొంగలు గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఈక్రమంలో తమ ఊరిలోని చెరువులో ఉన్న నీటి పాములు, కప్పలు, కీటకాలను అవి తింటాయి. అవి ఇక్కడ సంతానోత్పత్తి చేసుకొని.. తమ పిల్లలతో కలిసి దీపావళి పండుగ టైం తర్వాత వెళ్లిపోతాయని గ్రామస్థులు చెబుతున్నారు.
Read Also: Seema Haider: 2 రోజులు, 18 గంటల పాటు ప్రశ్నల వర్షం.. విచారణలో సీమా హైదర్ వెల్లడించిన నిజాలు
ఒకవేళ మా ఊళ్లో సెల్ టవర్స్ ఏర్పాటు చేస్తే ఈ పక్షుల సంతానోత్పత్తి ప్రక్రియకు ప్రమాదం పొంచి ఉందని లచ్కెరా గ్రామస్తులు భయపడుతున్నారు. ఈ కారణాలతో తమ ఊరిలో సెల్ ఫోన్ టవర్స్ ఏర్పాటు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని లచ్కెరా గ్రామ సర్పంచ్ వెల్లడించారు. మా ఊరికి ఇంటర్నెట్ కనెక్షన్ వీక్ గా ఉన్న పర్లేదు.. కానీ మా ఊరిని నమ్ముకొని వలస వచ్చే పక్షుల ప్రాణాలకు ప్రమాదం కలగడానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. ఊళ్లో ఎవరైనా వలస పక్షులకు హాని కలిగిస్తే.. వారికి రూ.1,000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. మా గ్రామంలో మొబైల్ టవర్ల ఏర్పాటుకు పర్మిషన్ లేదని చెబుతూ తీర్మానం కూడా చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గలకు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!