Rau’ IAS Study Circle : ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదం.. రావు స్టడీ సర్కిల్ యజమాని పై ఎఫ్ఐఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rau’ IAS Study Circle : ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు రావ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తాపై సీబీఐ బుధవారం కేసు నమోదు చేసింది. బిల్డింగ్ బేస్మెంట్లో నీరు నిలిచిపోవడంతో యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ కేసు దర్యాప్తును ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించింది. కోచింగ్ సెంటర్ యజమానిపై మళ్లీ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం సీబీఐ బృందం బుధవారం రావు ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనాన్ని సందర్శించి జూలై 27న ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ప్రాంతాన్ని పరిశీలించింది.
Read Also:TDP: నేడు టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ.. మిషన్ -2029కు ప్రణాళికలు!
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
అభిషేక్ గుప్తాపై నేరపూరిత నరహత్య, నిర్లక్ష్యంతో మరణం, స్వచ్ఛందంగా గాయపరచడం, నిర్లక్ష్యపు ప్రవర్తన తదితర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. గత నెల జులై 27న ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలోని రావు కోచింగ్ సెంటర్ భవనం బేస్మెంట్లో నీరు నిలిచిపోవడంతో సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందడం గమనార్హం. మృతుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన శ్రేయా యాదవ్ (25), తెలంగాణకు చెందిన తాన్యా సోని (25), కేరళకు చెందిన నవీన్ డాల్విన్ ఉన్నారు. గుప్తాతో పాటు ఇతర నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థుల మృతితో రాజేంద్రనగర్లో కోచింగ్ చదువుతున్న విద్యార్థులు రెండ్రోజులుగా ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
Read Also:Vinesh Phogat: వినేష్ ఫోగట్కు రివార్డు ప్రకటించిన హర్యానా ప్రభుత్వం..ఎంతంటే?
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!