CBI: ఇంటర్పోల్ సహకారంతో నకిలీ కరెన్సీ నోట్ల కేసు నిందితుడుని దేశానికి రప్పించిన సీబీఐ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI: నకిలీ భారత కరెన్సీ నోట్ల కేసులో ఎన్ఐఏకు కావలసిన నిందితుడు మొయిదీనబ్బ ఉమ్మర్ బేరీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి ఇంటర్పోల్ చానెళ్ల ద్వారా విజయవంతంగా భారతదేశానికి తీసుకురావడంలో సీబీఐ కీలక పాత్ర పోషించింది. సీబీఐ ఇంటర్పోల్ అంతర్జాతీయ పోలీసు సహకార విభాగం (IPCU), అబూదాబి నేషనల్ సెంట్రల్ బ్యూరో (NCB) సమన్వయంతో నిందితుడు మొయిదీనబ్బ ఉమ్మర్ బేరీని జూన్ 20న భారత్కు రప్పించింది. అతను దుబాయ్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు.
Read Also: Netanyahu: ఆమెరికా ఆదేశాల కోసం ఎదురుచూడలేం.. అణు స్థావరాలను మేమే ధ్వంసం చేస్తామన్న నెతన్యాహు
Also Read
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో కమిటీ
- Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ఈ నిందితుడిని ముందుగా యూఏఈలో సీబీఐ, అబూదాబి ఎన్సీబీ మాద్యమంగా ఇంటర్పోల్ ద్వారా గుర్తించడం జరిగింది. అనంతరం రెడ్ నోటీసు ఆధారంగా అతడిని అరెస్ట్ చేసి భారతదేశానికి తరలించారు. మొయిదీనబ్బపై ఎన్ఐఏ కొచ్చి బ్రాంచ్ ఆధ్వర్యంలో నకిలీ నోట్ల తయారీ, మోసం, క్రిమినల్ కౌన్స్పిరసీ ఆరోపణలతో కేసు నమోదైంది. అతను దుబాయ్లో నకిలీ భారత కరెన్సీ నోట్లను పొందాడని, షార్జా ద్వారా బెంగళూరుకు తరలించాడని ఎన్ఐఏ అభియోగం.
Read Also: Mayor Suresh Babu: కడప కార్పొరేషన్ సమావేశంపై ఉత్కంఠ.. నా ఇష్టం అంటున్న మేయర్!
సీబీఐ 2013 డిసెంబర్ 30న ఇంటర్పోల్ ద్వారా నిందితుడిపై రెడ్ నోటీసును జారీ చేసింది. ఈ నోటీసును ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖలకు పంపించారు. యూఏఈలో అతడిని అరెస్ట్ చేసిన తరువాత, మంత్రిత్వ శాఖల ద్వారా అధికారిక ఎక్స్ట్రడిషన్ అభ్యర్థన కూడా పంపబడింది. ఇంటర్పోల్కు భారతదేశ నేషనల్ సెంట్రల్ బ్యూరోగా పనిచేస్తున్న సీబీఐ, దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ శాఖలతో భారతపోల్ ద్వారా సమన్వయం చేస్తూ ఇంటర్పోల్ సహకారంతో నేరస్థుల ట్రాకింగ్, అరెస్ట్, తరలింపులను సమర్థంగా నిర్వహిస్తోంది. ఈ ఇంటర్పోల్ చానెళ్ల ద్వారా 100కిపైగా అంతర్జాతీయ నేరస్థులను భారత్కు తీసుకురాగలిగింది.
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!