జీడిమామిడిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పండిస్తారు.. రాష్ట్రంలోని నెల్లూరు,శ్రీకాకుళంలో కోస్తా తీర ప్రాంతంలో మూడు లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. ఉత్పత్తి 95 వేల టన్నులు, ఉత్పాదకత ఎకరాకు 280 కేజీల వరకు ఉంటుంది.. ముందుగా జీడీమామిడి విత్తనాల కోసం తల్లి మొక్క నుంచి పొందాలి.. ఎలాగంటే ఒత్తుగా కురచ కొమ్మలు, ఎక్కువగా ఉండాలి. ఎక్కువ శాతం ఆడ పువ్వులను కలిగిఉండాలి. మధ్య సైజు కలిగిన గింజలు కలిగి అధిక దిగుబడినిచ్చే విధంగా ఉండాలి.. అలాంటి మొక్కల నుంచి తీసిన గింజల తో వేసినప్పుడు మొక్కలు వ్యాధులను తట్టుకుంటాయి..
సాదారణంగా నాలుగు నెలల వయసు పైబడి 10-15 ఆకులు కల్గి ఉన్న అంటు మొక్కలను పొలంలో నాటుటకు ఉపయోగించాలి..ఈ గింజలు మొలకెత్తి శక్తిని త్వరగా కోల్పోతాయి. అందుకే అప్పుడే సేకరించిన గింజలను నాటుకొనుటకు వాడాలని నిపుణులు చెబుతున్నాయి. మధ్య పరిమాణం గల 5నుండి 6 గ్రాముల బరువుండే విత్తనపు గింజలను సేకరించాలి. విత్తనాన్ని సుమారు 2-3 రోజులు బాగా ఎండబెట్టాలి. హెక్టారుకు సుమారు 2 కేజీల విత్తనపు గింజలు సరిపోతాయి. గింజలను నాటేముందు రెండు రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి..
హెక్టారుకు సుమారు 2 కేజీల విత్తనపు గింజలు సరిపోతాయి. గింజలను నాటేముందు రెండు రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి.విత్తనాన్ని నారుగా పెంచిగాని లేక పొలంలో నేరుగా నిర్ణీత భాగాలలో విత్తవచ్చును, విత్తనాన్ని పాలిథీన్ సంచులలో విత్తుట మంచిది.. నీటిని ఎక్కువగా పెట్టరాదు.. అలా చేస్తే విత్తనం కుళ్లి పోతుంది.. మంచిగా ఎండ తగిలే ప్లేసులో ఉంచడం మంచిది.. 30 రోజులలోగా మొలకలు వస్తాయి.. 50 రోజుల లోగ మొక్కలను నాటాలి..నెలల వయసు కల్గినప్పుడు నాటటం మంచిది. నేరుగా విత్తదల్చుకున్నప్పుడు ప్రతి గుంతకు 2-3 విత్తనాలు విత్తి తర్వాత ఏపుగా దృఢంగా పెరుగుచున్న ఒక మొలకను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. వర్షం పడిన తరువాత జీడిమామిడిని జూలై ఆగష్టు నెలల్లో నాటుకోవాలి…