Hyderabad: కూకట్ పల్లి అంకుర ఆసుపత్రిలో మరో దారుణం.. డెలివరీ కోసం వెళ్లిన డాక్టర్కి..
- కూకట్ పల్లి అంకుర హాస్పిటల్ లో దారుణం
- బాలింతకు చలి తీవ్రత పెరగడంతో కాళ్లకు హీట్ ప్యాడ్స్
- హీట్ ప్యాడ్స్ ను తీసేయడం మర్చిపోయారు ఆసుపత్రి సిబ్బంది
కూకట్ పల్లి అంకుర హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ కోసం వెళ్లిన డాక్టర్ సంధ్యకు చేధు అనుభవం ఎదురైంది. నిజంపేటకు చెందిన సంధ్య డెలివరీ కోసం అంకుర ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా ట్విన్స్ కు జన్మనిచ్చింది. ఆ తర్వాత MICU కి షిఫ్ట్ చేశారు. కాసేపటికే బాలింతకు చలి తీవ్రత పెరగడంతో కాళ్లకు హీట్ ప్యాడ్స్ కట్టారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది హీట్ ప్యాడ్స్ ను తీసేయడం మర్చిపోయారు.
Also Read:Daggubati Prasad: వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది.. గాలి తరహాలో జగన్ కూడా..!
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
ఆ తర్వాత బాధితురాలికి మత్తు వదిలి స్పృహలోకి వచ్చింది. అప్పటికే హీట్ ప్యాడ్స్ కారణంగా కాళ్లకు బొబ్బలు వచ్చాయి. ఆ బాధను భరించలేక బాధితురాలు కేకలు వేసింది. అప్పటికీ గాని ఆసుపత్రి సిబ్బంది మొద్దు నిద్ర వీడలేదు. బాలింత అరుపులతో తేరుకున్న సిబ్బంది వచ్చి హీట్ ప్యాడ్స్ తీసేశారు. అప్పటికే సంధ్య రెండు కాళ్ళు బొబ్బలు ఎక్కి చర్మం ఊడిపోయింది. రెండు కాళ్లుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంకుర హాస్పిటల్ తీరుపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:COVID 19: ఏలూరు కలెక్టరేట్లో కరోనా కలకలం..! నలుగురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్
MICUలో సిబ్బంది లేరని, హౌస్ కీపింగ్ తో ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అదే ఆసుపత్రిలో సంధ్య చికిత్స పొందుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంకురా హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అంకుర హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూకట్ పల్లి పోలీసులు అంకురా హాస్పిటల్ పై కేస్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!