Perni Nani: మాజీ మంత్రి పేర్నినానికి షాకిచ్చిన పోలీసులు..
- మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్లో కేసు నమోదు..
- నిన్న R పేట సీఐతో పేర్ని నాని వాగ్వివాదం..
- ఈ విషయంపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్..
- ఈ పరిణామాల నేపథ్యంలో పేర్ని నాని పై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి షాకిచ్చారు పోలీసులు.. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారంటూ చిలకలపూడి పోలీసు స్టేషన్లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.. అయితే, వైసీపీ నేత సుబ్బన్నను నిన్న (శుక్రవారం) విచారణకు పిలిచారు మచిలీపట్నం టౌన్ పోలీసులు.. ఈక్రమంలో ఆ పీఎస్కు వెళ్లిన పేర్ని నాని.. సీఐపై సీరియస్ అయ్యారు.. ఓ దశలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.. మాజీ మంత్రి పేర్ని నానిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో.. పేర్ని నానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. పేర్ని నాని సహా 29 మందిపై కేసు నమోదు చేశారు..
Read Also: Trump Health : ట్రంప్ హెల్త్ రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు.. వయసు పెరుగుతున్నా.. అది మాత్రం…
Also Read
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
కాగా, మాజీ మంత్రి పేర్ని నాని నేతృత్వంలో మెడికల్ కళాశాల వద్ద ఇటీవల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు వైసీపీ నేతలు.. కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు వారించే ప్రయత్నం చేశారు.. వారితో వాగ్వాదానికి దిగిన వైసీపీ నేతలు.. పోలీసుల లాఠీలు లాక్కున్నారు. దీంతో ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు.. 41ఏ నోటీసులు ఇచ్చారు. పీఎస్కు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే, తాను చెప్పేవరకూ ఎవరూ పోలీసుల వద్దకు వెళ్లవద్దదు అంటూ వైసీపీ సిటీ ప్రెసిడెంట్ మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. నిన్న సుబ్బన్నను అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని.. వైసీపీ శ్రేణులతో కలిసి మచిలీపట్నం టౌన్ పీఎస్కు వెళ్లారు.. సీఐ గదిలోకి వెళ్లి ఆయనతో వాగ్వాదానికి దిగారు.. పేర్ని నానితో పాటు వైసీపీ నేతలు కొందరు సీఐపై విరుచుకుపడ్డారు.. సీఐకి వేలు చూపిస్తూ.. వార్నింగ్ ఇచ్చేంత పనిచేశారు.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు. ఇప్పుడు పేర్ని నాని సహా 29 మంది కేసు నమోదు చేశారు..
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?