Death Penalty: ఆ ఒక్క మందు 144 మంది ఉరిశిక్షకి కారణం.. అసలేంటి ఆ మందు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death Penalty: సౌదీ అరేబియాలో గత కొద్దీ కాలంగా కాలక్రమేణా కొత్త ముప్పు వేగంగా పెరుగుతోంది. అదే ‘క్యాప్టగాన్’ (Captagon) ముప్పు. క్యాప్టగాన్ అనేది ఒక డ్రగ్. 2025లో ఇప్పటివరకు సౌదీలో 217 మందికి ఉరిశిక్ష అమలు చేయగా.. అందులో 144 మందికి ఈ మందు వల్లే ఉరిశిక్ష పడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..
క్యాప్టగాన్ అనేది ఒక ఎమ్ఫెటమిన్ తరహా మత్తు మందు. దీన్ని “పేదల కోకైన్” అని కూడా పిలుస్తారు. ఇది మానసిక ఉల్లాసాన్ని కలిగించే మత్తు మందుగా బాగా ప్రేవు గాంచింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో అలాగే సౌదీలో ఉన్న ధనిక యువతలో దీన్ని తీసుకోవడం బాగా అలవాటుగా మారింది. ముఖ్యంగా చాలామంది యువత దీనికి బానిసలైపోయారు. దీనివల్ల, ఆ మందును సరఫరా చేసే వారిని మాత్రం నేరుగా ఉరిశిక్షతో శిక్షిస్తున్నారు.
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
ICC Rankings: మనల్ని ఎవర్రా ఆపేది.. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ లేపిన టీమిండియా స్టార్స్..!
ఈ డ్రగ్స్ సరఫరాలో మిస్ర్ (ఈజిప్ట్), పాకిస్తాన్, ఇతియోపియా, సిరియా వంటి దేశాల వలసదారులే అధికంగా పాల్గొంటున్నవారు. ఒక్క జూన్ నెలలోనే డ్రగ్స్ కేసుల్లో 37 మందికి ఉరిశిక్ష విధించగా.. అందులో 34 మంది విదేశీ పౌరులే. ఇది అంతర్జాతీయంగా తీవ్రమైన విమర్శలకు దారితీసినా.. సౌదీ అధికారులు తాము తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వెనక్కి మాత్రం తగ్గడం లేదు. ఈ ముందుకు ఇదివరకు ప్రధాన కేంద్రంగా సిరియా ఉండేది. 2023 నాటికి ప్రపంచ క్యాప్టగాన్ ఉత్పత్తిలో మెజారిటీ శాతం సిరియా నుంచే వచ్చేది. సిరియా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో డ్రగ్ వ్యాపారమే వారి ప్రధాన ఆదాయ మార్గంగా మారింది. అయితే అక్కడ బషర్ అల్ అసద్ సర్కారు కూలిన తర్వాత 2024 డిసెంబరులో ఏర్పడిన ప్రభుత్వం ఈ డ్రగ్ తయారీ కర్మాగారాలన్నీ మూసేశామని జూన్ లో ప్రకటించినా.. ఇప్పుడు కూడా సౌదీలో ఈ డ్రగ్ లభ్యమవుతూనే ఉంది.
Panneerselvam: ఎన్డీఏకు గుడ్బై చెప్పిన పన్నీర్ సెల్వం.. స్టాలిన్ను కలిసిన తర్వాత ప్రకటన
క్యాప్టగాన్ డ్రగ్ సౌదీ సమాజానికి ప్రాణాంతకంగా భావిస్తున్నట్లు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. ఇది సౌదీ నైతిక మౌలికతల్ని ధ్వంసం చేస్తుందని.. అందుకే, కఠినంగా ఎదుర్కోవాల్సిన విషయం ఇది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఫిర్యాదు చేస్తున్నా.. మరోవైపు డ్రగ్ సరఫరాదారులపై ఉరిశిక్ష అమలు చేయడాన్ని కొనసాగిస్తున్నారు సౌదీ అధికారులు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..