Damodara Raja Narasimha : సిజేరియన్ డెలివరీలపై కఠిన చర్యలు… ఆరోగ్యశాఖ మంత్రి కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodara Raja Narasimha : ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియన్ డెలివరీలు అత్యధికంగా చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన సి-సెక్షన్ ఆడిట్ను మరింత కఠినంగా నిర్వహించాలని సూచించారు. గురువారం, కోఠీలోని టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, మంత్రి ప్రభుత్వ హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నార్మల్ డెలివరీలు చేసే లాభాలను, సి-సెక్షన్ వల్ల కలిగే నష్టాలను గర్భిణీలకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఏంటి నాటల్ చెకప్స్ సమయంలో వివరించాలని ఆయన సూచించారు.
మరిన్ని నార్మల్ డెలివరీలు జరగాలంటే, ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేస్తున్న నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అలాగే, మాతా-శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో వసతులను మెరుగుపరచాలని, గర్భిణులను ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీ చేయించుకోవడానికి ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఎండలు మరియు అధిక ఉష్ణోగ్రతలు కారణంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలు హాస్పిటల్స్లో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అన్ని హాస్పిటల్స్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన వార్డులలో ఏసీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అలాగే, ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై కూడా మంత్రి ఆరా తీశారు. గతేడాది 8 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 6200కి పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఆఫీసర్లు, మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ వంటి పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలో ఫలితాలు విడుదల చేసి, నెల రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి సకాలంలో ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ ఆర్ వీ కర్ణన్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డీహెచ్ డాక్టర్ రవిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Minister Ponmudy: ఆ మంత్రిపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!