Damodara Raja Narasimha : సిజేరియన్ డెలివరీలపై కఠిన చర్యలు… ఆరోగ్యశాఖ మంత్రి కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodara Raja Narasimha : ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియన్ డెలివరీలు అత్యధికంగా చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన సి-సెక్షన్ ఆడిట్ను మరింత కఠినంగా నిర్వహించాలని సూచించారు. గురువారం, కోఠీలోని టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, మంత్రి ప్రభుత్వ హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నార్మల్ డెలివరీలు చేసే లాభాలను, సి-సెక్షన్ వల్ల కలిగే నష్టాలను గర్భిణీలకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఏంటి నాటల్ చెకప్స్ సమయంలో వివరించాలని ఆయన సూచించారు.
మరిన్ని నార్మల్ డెలివరీలు జరగాలంటే, ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేస్తున్న నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అలాగే, మాతా-శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో వసతులను మెరుగుపరచాలని, గర్భిణులను ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీ చేయించుకోవడానికి ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఎండలు మరియు అధిక ఉష్ణోగ్రతలు కారణంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలు హాస్పిటల్స్లో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అన్ని హాస్పిటల్స్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన వార్డులలో ఏసీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అలాగే, ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
Also Read
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై కూడా మంత్రి ఆరా తీశారు. గతేడాది 8 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 6200కి పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఆఫీసర్లు, మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ వంటి పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలో ఫలితాలు విడుదల చేసి, నెల రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి సకాలంలో ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ ఆర్ వీ కర్ణన్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డీహెచ్ డాక్టర్ రవిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Minister Ponmudy: ఆ మంత్రిపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం..
తాజావార్తలు
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్ను చంపింది మేమే.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!