Revanth Reddy: ఆగస్ట్ 15 లోపు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జన జాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాట మేరకు మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశామన్నారు. కృష్ణ – వికారాబాద్ రైల్వే లైన్ పదేళ్లు పడవ్ పెడితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.. కాంగ్రెస్ పార్టీ తరపున కాంట్రాక్టర్లు, ధనవంతులకు టిక్కెట్లు ఇవ్వలేదు.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ముదిరాజులకు ఒక్క సీటు ఇవ్వలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ముదిరాజులు బీసీ- డీ నుంచి బీసీ- ఏగా మారాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలన్నారు. మెదక్ లో నీలం ముదిరాజ్ ను గెలిపించండి.. తెలంగాణలో 14 ఎంపీ సీట్లను గెలిపించండి ఆగస్ట్ 15 తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది అన్నారు. అలాగే, ఉద్దండులైన న్యాయవాదులను పెట్టించి సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల వర్గీకరణపై కొట్లడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: SRH vs RCB: భారీ స్కోరు చేసిన సన్ రైజర్స్.. ఆర్సీబీ బౌలర్లపై ఊచకోత
Also Read
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
అయితే, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి రైతు రుణమాఫీ చేయలేదు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్ట్ 15వ తేదీ లోపు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం అన్నారు. వచ్చే సారి పండించే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత నాదన్నారు. ఎంపీ ఎన్నికలు ముగిసిన రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. ఎంపీ ఎన్నికల్లో బూతుల్లో మెజారిటీ ఎవరు తెస్తారో వారికి టికెట్ల ఇచ్చి గెలిపిస్తాం.. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు వేయబోతున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం 5 ఎంపీ స్థానాల్లో మోడీనీ గెలిపించేందుకు సుపారి తీసుకొని నాయకుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు.. బిడ్డ పెళ్లి ఉన్నప్పుడు వదలకుండా నన్ను జైల్లో పెట్టారు.. బిడ్డ జైలుకు పోగానే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాడు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Rice size: సంగారెడ్డి జిల్లాలో 500 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఇక, మేము అధికారంలోకి రాగనే 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లకు రూ. 5లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని సీఎం రేవంత్ చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని అంటున్నారు.. ఇళ్లు, ఉచిత ప్రయాణం, కరెంటు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, బిసి జనాభా , 30వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు ఓడ గొడతారా? అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో కేసీఆర్ 100 ఏళ్ల విధ్వంసం సృష్టిస్తే ఒక్కోక్కటిగా చక్కదిద్దుతున్నా.. ఒక్క రోజు సెలవు పెట్టకుండా పని చేస్తున్నాను.. బీజేపీ ముసుగులో బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కై రేవంత్ రెడ్డిని ఓడగొట్టలని చూస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా BRSకు ఓటు వేయమని అడుగుతున్నారా?.. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీనీ గెలిపించేందుకు BRS కుమ్మైకయ్యారు అని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!