Bus Accident: బరోడా మహిళా క్రికెట్ జట్టుకు బస్సు ప్రమాదం.. నలుగురికి గాయాలు

Bus Accident

Bus Accident

Bus Accident: విశాఖపట్నంలో బరోడా మహిళా క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సు కు ప్రమాదం జరిగింది. విశాఖపట్నంలో జరుగుతున్న మ్యాచ్ ను ముగించుకొని బరోడా జట్టు ఎయిర్ పోర్టుకు వెళుతున్న సమయంలో తాటి చెట్ల పాలెం జాతీయ రహదారి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సుకి ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.

Read Also: DCM Larry Accident: డీసీఎంను ఢీకొట్టిన లారీ.. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన ఇద్దరు

×
×
Ad

బస్సులో ఉన్న నలుగురికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. ఈ నెల 11 నుంచి విశాఖలో మహిళల సీనియర్ టి20 మ్యాచ్ ప్రారంభమైంది.

Read Also: School Bus Accident: ప్రమాదంలో స్కూల్‌ బస్సు నుజ్జునుజ్జు.. తృటిలో తప్పించుకున్న 20 మంది విద్యార్థులు