Sheikh Hasina: “మీ భార్యల భారతీయ చీరలని కాల్చండి”.. “ఇండియా ఔట్” ప్రచారంపై పీఎం హసీనా ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: మాల్దీవుల దారిలోనే ‘‘ఇండియా ఔట్’’ అనే నినాదంతో బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ ఉద్యమాన్ని లేవనెత్తింది. భారతదేశానికి మిత్రురాలిగా ఉన్న ఆ దేశ ప్రధాని షేక్ హసీనాపై ద్వేషంతో అక్కడ మతఛాందసవాద బీఎన్పీ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే, ఈ ప్రచారంపై ప్రధాని షేక్ హసీనా ఘాటుగా స్పందించారు. నిజంగా భారతీయ ఉత్పత్తులను బహిష్కరిస్తే, ముందు వారు తమ భార్యల భారతీయ చీరలని తగలబెట్టాలని సవాల్ విసిరారు.
బంగ్లాదేశ్ పీఎం హసీనా ఇటీవల ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ప్రారంభించిన భారతదేశ వ్యతిరేక ప్రచారంపై విరుచుకుపడ్డారు. బుధవారం ఒక ప్రసంగంలో మాట్లాడుతూ.. బీఎన్పీ నాయకులు నిజంగా భారత ఉత్పత్తులను బహిష్కరిస్తే, వారు వారి భార్యల భారతీయ చీరలను ముందుగా తగలబెట్టాలని అన్నారు. భారతీయ మసాలాలు లేకుండా తినగలారా..? అని ప్రశ్నించారు. నిజంగా వారు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించగలరా..? అని అన్నారు.
Also Read
‘‘బీఎన్పీ నాయకులు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని వాదిస్తున్నారు.. నా ప్రశ్న ఏంటంటే, ఈ ప్రచారం చేస్తున్న వారు తమ భార్యల వద్ద ఎన్ని భారతీయ చీరలు ఉన్నాయి.? వారు తమ భార్యల నుంచి చీరలను ఎందుకు తీసుకుని తగలబెట్టలేదు..?’’ అని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీఎన్పీ సీనియర్ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ.. సాధారణంగా భారతీయ చీరలని బీఎన్పీ నాయకులు కొనుగోలు చేయరని, చాల ఏళ్ల క్రితం భారత్కి వచ్చిన సమయంలో తన మామా తన భార్యకు భారతీయ చీరను బహుమతిగా ఇచ్చారని అన్నారు.
Read Also: PM Modi: “సుప్రీంకోర్టుకు వెళ్లినా వారు బెయిల్ పొందలేరు”.. ఇండియా కూటమిపై ప్రధాని ఫైర్…
ఈ ఏడాది ప్రారంభంలో భారతీయ ఉత్పత్తులను బహిష్కరించండి అనే ప్రచారం అక్కడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. ప్రతిపక్ష పార్టీ ఈ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తోంది. బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాల్లో భారత జోక్యాన్ని వ్యతిరేకిస్తూ తాము ఈ ప్రచారాన్ని చేపట్టినట్లు ప్రతిపక్షం చెబుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికలను బీఎన్పీ బహిష్కరించింది, ఈ ఎన్నికల్లో మరోసారి షేక్ హసీనా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు.
బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకత పెరుగుతోంది. భారత ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల బంగ్లాదేశ్ రాజకీయంగా నష్టపోయిందని అక్కడి ప్రతిపక్ష బీఎన్పీ ఆరోపిస్తోంది. గత 15 ఏళ్లుగా బంగ్లా ఎన్నికల్లో ఇండియా జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకను భారత్ పట్టించుకోలేదని, 4బిలియన్ డాలర్ల సాయం చేయడాన్ని అవాస్తవం అని ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ‘‘బాయ్కాట్ ఇండియా’’ ప్రచారం చేయడం వల్ల బంగ్లా-భారత్ ప్రజల మధ్య మతపరమైన, జాతీయవాద ఉద్రిక్తతలు ఏర్పడుతాయని బంగ్లా ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!