Site icon NTV Telugu

Buried Truth :బరీడ్ ట్రూత్ ఓటీటీ డాక్యుమెంటరీ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది..

Whatsapp Image 2024 02 12 At 10.30.43 Pm

Whatsapp Image 2024 02 12 At 10.30.43 Pm

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్ వస్తోంది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన, రకరకాల మలుపులు తిరిగిన షీనా బోరా హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందింది.దీంతో ఈ డాక్యుమెంట్టరీ సిరీస్ పై చాలా ఆసక్తి నెలకొంది. 2012లో షీనా బోరా హత్యకు గురయ్యారు. 2015లో ఈ విషయం బయటికి వచ్చింది. ఈ షీనా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీని పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పట్లో సంచలనంగా మారింది. ఆ కేసు గురించి ఇప్పుడు ‘బరీడ్ స్టోరీ’ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ రూపొందుతుంది.. ఈ సిరీస్ ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 12) రిలీజ్ అయింది.ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ డాక్యు సిరీస్‍ నాలుగు ఎపిసోడ్లుగా ఉండనుంది. ఇరా బాహ్ల్, షానా లెవీ దీనికి దర్శకత్వం వహించారు. మేక్‍మేక్ మరియు ఇండియా టుడే గ్రూప్ ఈ సిరీస్‍ను నిర్మించాయి. ఫిబ్రవరి 23వ తేదీన ఈ డాక్యు సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ క్రమంలో లో నెట్‍ఫ్లిక్స్ నేడు ట్రైలర్ ను రిలీజ్ చేసింది.

షీనా బోరా హత్య జరిగిన మూడేళ్ల తర్వాత ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జియా అరెస్ట్ అయిన న్యూస్ రిపోర్టులతో ‘ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ సిరీస్ ట్రైలర్ మొదలైంది. ముందుగా షినా.. ఇంద్రాణి సోదరి అని అనుకోవడం.. ఆ తర్వాత కూతురు అని తెలియడం కూడా ట్రైలర్లో ఉంది. ముంబైలో ముఖర్జియా, బోరా కుటుంబాల జీవితాలను మార్చేసిన ఘటనలతో ఈ సిరీస్ రూపొందింది.ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత ఎజెండాలు ఉన్నాయంటూ ట్రైలర్లో చూపించడం జరిగింది.. ముఖర్జియా, బోరా కుటుంబాల్లో ఉన్న చిక్కుముడులను, సభ్యుల మధ్య దెబ్బతిన్న బంధాలను కూడా సిరీస్‍లో మేకర్స్చూపించనున్నారు. డాక్యుమెంటరీ సిరీస్ కావడంతో వీటిల్లో కొన్ని ఒరిజినల్ ఇంటర్వ్యూలను కూడా మేకర్స్ చూపించనున్నారు. ఇంద్రాణి ముఖర్జియా, వారి కుటుంబం,అటార్నీలు మరియు కొందరు జర్నలిస్టుల ఇంటర్వ్యూలు ఉండనున్నాయి.దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ సంక్లిష్టమైన కేసును డాక్యుమెంటరీ సిరీస్‍గా తీసుకొస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది.

Exit mobile version