Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: రాజస్థాన్లోని బుండి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈకో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత స్థానిక ఆసుపత్రిలో చేర్పించి, అక్కడి నుంచి కోటాకు తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్ నుంచి వచ్చి సికార్లో ఖతు శ్యామ్ దర్శనానికి వెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతులందరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read Also:UP T20 League 2024: రెండో సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రింకు సింగ్ జట్టు..
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ఈ ప్రమాదం బుండిలోని హిందోలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చెరువు పక్కనే ఉన్న ఓవర్బ్రిడ్జి సమీపంలో ఆదివారం ఉదయం లారీ, ఈకో కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎకో కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా వెనుక కూర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఎస్పీ బుండి, సీఓ హిందోలి పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Read Also:Ganesh Immersion: అటు బాలాపూర్.. ఇటు ఖైరతాబాద్.. రూట్మ్యాప్ విడుదల చేసిన సీపీ ఆనంద్..
గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వెంటనే ప్రథమ చికిత్స చేసి కోట ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, వారి కుటుంబాలకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు సహాయం అందడంలో జాప్యం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బండి ఎస్పీ హనుమాన్ ప్రసాద్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. లారీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా డ్రైవర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రక్కు లేదా ఈకో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!