Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం
Road Accident: రాజస్థాన్లోని బుండి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈకో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత స్థానిక ఆసుపత్రిలో చేర్పించి, అక్కడి నుంచి కోటాకు తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్ నుంచి వచ్చి సికార్లో ఖతు శ్యామ్ దర్శనానికి వెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతులందరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read Also:UP T20 League 2024: రెండో సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రింకు సింగ్ జట్టు..
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
ఈ ప్రమాదం బుండిలోని హిందోలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చెరువు పక్కనే ఉన్న ఓవర్బ్రిడ్జి సమీపంలో ఆదివారం ఉదయం లారీ, ఈకో కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎకో కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా వెనుక కూర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఎస్పీ బుండి, సీఓ హిందోలి పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Read Also:Ganesh Immersion: అటు బాలాపూర్.. ఇటు ఖైరతాబాద్.. రూట్మ్యాప్ విడుదల చేసిన సీపీ ఆనంద్..
గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వెంటనే ప్రథమ చికిత్స చేసి కోట ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, వారి కుటుంబాలకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు సహాయం అందడంలో జాప్యం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బండి ఎస్పీ హనుమాన్ ప్రసాద్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. లారీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా డ్రైవర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రక్కు లేదా ఈకో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!