Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: రాజస్థాన్లోని బుండి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈకో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత స్థానిక ఆసుపత్రిలో చేర్పించి, అక్కడి నుంచి కోటాకు తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్ నుంచి వచ్చి సికార్లో ఖతు శ్యామ్ దర్శనానికి వెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతులందరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read Also:UP T20 League 2024: రెండో సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రింకు సింగ్ జట్టు..
Also Read
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ఈ ప్రమాదం బుండిలోని హిందోలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చెరువు పక్కనే ఉన్న ఓవర్బ్రిడ్జి సమీపంలో ఆదివారం ఉదయం లారీ, ఈకో కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎకో కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా వెనుక కూర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఎస్పీ బుండి, సీఓ హిందోలి పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Read Also:Ganesh Immersion: అటు బాలాపూర్.. ఇటు ఖైరతాబాద్.. రూట్మ్యాప్ విడుదల చేసిన సీపీ ఆనంద్..
గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వెంటనే ప్రథమ చికిత్స చేసి కోట ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, వారి కుటుంబాలకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు సహాయం అందడంలో జాప్యం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బండి ఎస్పీ హనుమాన్ ప్రసాద్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. లారీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా డ్రైవర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రక్కు లేదా ఈకో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?