Budget 2025: ఆదాయపు పన్నులో పెద్ద ఉపశమనం.. మధ్య తరగతికి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 2025: బడ్జెట్ 2025 అనేక కారణాల వల్ల చారిత్రాత్మకంగా మారనుంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి మంత్రి అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్న ఈ పరిస్థితిలో, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఉపశమనం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్ను రేట్లలో మార్పులు, ఆదాయపు పన్ను మినహాయింపుల్లో పెరుగుదల ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
ద్రవ్యోల్బణం, నెమ్మదిగా పెరుగుతున్న జీతాలతో సతమతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను స్లాబ్లో మార్పులు రావొచ్చని భావిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను తీసుకురావొచ్చు. ముఖ్యంగా పన్ను తగ్గింపుల వల్ల వినియోగదారుల ఖర్చులు పెరిగే అవకాశముండటంతో, ఇది ఆర్థిక వ్యవస్థకు కొంత బలాన్ని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
Read Also:Gas Cylinder Price : బడ్జెట్ కు ముందే వినియోగదారులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన సిలిండర్ ధర
కేంద్ర ప్రభుత్వ ఖర్చులు పెరిగే సూచనలు
డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ ప్రకారం.. ప్రైవేట్ వినియోగం క్రమంగా మెరుగుపడుతున్నా, పెట్టుబడి కార్యకలాపాలు తక్కువగానే ఉన్నాయన్నారు. అయితే, ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని, దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగా ఉండొచ్చని చెప్పారు.
కాపెక్స్ 20శాతం పెరుగుతుందని అంచనా
ఎర్నెస్ట్ & యంగ్ (EY) నివేదిక ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మూలధన వ్యయం (Capex) కనీసం 20శాతం పెంచే అవకాశం ఉంది. EY ఇండియా చీఫ్ పాలసీ సలహాదారు డికె శ్రీవాస్తవ్ ప్రకారం, వృద్ధిని వేగవంతం చేయడం, ఆర్థిక నియంత్రణను సమతుల్యం చేయడం ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమవుతుందని తెలిపారు. అదే సమయంలో, కేంద్రం ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉండి స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరిచే విధానాన్ని అమలు చేయవచ్చని డీబీఎస్ సీనియర్ ఆర్థికవేత్త రాధిక రావు అభిప్రాయపడ్డారు.
Read Also:Union Budget 2025: నేడు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి..
మొత్తంగా…
ఈసారి బడ్జెట్లో మధ్యతరగతికి ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండే అవకాశముంది. ముఖ్యంగా, పన్ను తగ్గింపులు, పెట్టుబడుల పెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత నిధులు కేటాయించే అంశాలు ప్రధానంగా ఉండవచ్చని అంచనా. శనివారం ప్రవేశపెట్టబోయే 2025-26 బడ్జెట్పై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!