Budget 2025: ఆదాయపు పన్నులో పెద్ద ఉపశమనం.. మధ్య తరగతికి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్
Budget 2025: బడ్జెట్ 2025 అనేక కారణాల వల్ల చారిత్రాత్మకంగా మారనుంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి మంత్రి అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్న ఈ పరిస్థితిలో, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఉపశమనం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్ను రేట్లలో మార్పులు, ఆదాయపు పన్ను మినహాయింపుల్లో పెరుగుదల ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
ద్రవ్యోల్బణం, నెమ్మదిగా పెరుగుతున్న జీతాలతో సతమతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను స్లాబ్లో మార్పులు రావొచ్చని భావిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను తీసుకురావొచ్చు. ముఖ్యంగా పన్ను తగ్గింపుల వల్ల వినియోగదారుల ఖర్చులు పెరిగే అవకాశముండటంతో, ఇది ఆర్థిక వ్యవస్థకు కొంత బలాన్ని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read
- 1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..
- SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
- Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
Read Also:Gas Cylinder Price : బడ్జెట్ కు ముందే వినియోగదారులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన సిలిండర్ ధర
కేంద్ర ప్రభుత్వ ఖర్చులు పెరిగే సూచనలు
డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ ప్రకారం.. ప్రైవేట్ వినియోగం క్రమంగా మెరుగుపడుతున్నా, పెట్టుబడి కార్యకలాపాలు తక్కువగానే ఉన్నాయన్నారు. అయితే, ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని, దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగా ఉండొచ్చని చెప్పారు.
కాపెక్స్ 20శాతం పెరుగుతుందని అంచనా
ఎర్నెస్ట్ & యంగ్ (EY) నివేదిక ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మూలధన వ్యయం (Capex) కనీసం 20శాతం పెంచే అవకాశం ఉంది. EY ఇండియా చీఫ్ పాలసీ సలహాదారు డికె శ్రీవాస్తవ్ ప్రకారం, వృద్ధిని వేగవంతం చేయడం, ఆర్థిక నియంత్రణను సమతుల్యం చేయడం ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమవుతుందని తెలిపారు. అదే సమయంలో, కేంద్రం ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉండి స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరిచే విధానాన్ని అమలు చేయవచ్చని డీబీఎస్ సీనియర్ ఆర్థికవేత్త రాధిక రావు అభిప్రాయపడ్డారు.
Read Also:Union Budget 2025: నేడు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి..
మొత్తంగా…
ఈసారి బడ్జెట్లో మధ్యతరగతికి ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండే అవకాశముంది. ముఖ్యంగా, పన్ను తగ్గింపులు, పెట్టుబడుల పెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత నిధులు కేటాయించే అంశాలు ప్రధానంగా ఉండవచ్చని అంచనా. శనివారం ప్రవేశపెట్టబోయే 2025-26 బడ్జెట్పై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..
-
SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
-
Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!