Budget 2024: బడ్జెట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న పన్ను చెల్లింపుదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం కోసం వేచి చూడాల్సిందే. దీనితో పాటు, సాధారణ పన్ను చెల్లింపుదారులు కూడా మరో విషయం కోసం ఎదురు చూస్తున్నారు. బడ్జెట్లో పన్ను మినహాయింపు లేదా పన్ను పరిమితికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా పెద్ద ప్రకటన వస్తుందని ఆశపడుతున్నారు. అయితే దీనిపై నిపుణులు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో పన్నుకు సంబంధించి ప్రభుత్వం పెద్దగా ఎలాంటి ప్రకటన చేయకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బడ్జెట్లో టాక్స్ ఫ్రంట్పై రిలీఫ్ గురించి అడిగినప్పుడు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపిఎఫ్పి) ప్రొఫెసర్ ఎన్ఆర్ భానుమూర్తి, ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపుతాయని నేను అనుకోవడం లేదని అన్నారు. కానీ ప్రత్యక్ష పన్ను విధానం ప్రభావితం అవుతుంది. ప్రైవేట్ వినియోగం ఆందోళన కలిగించే విషయం కాబట్టి, పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నప్పుడు జీఎస్టీ కౌన్సిల్ దాని రేట్లను తగ్గించడాన్ని పరిగణించాలి.
Read Also:Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
- Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ 'రాగి మిల్క్'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
మ్యూనిచ్కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలక మండలి సభ్యుడు చక్రవర్తి మాట్లాడుతూ.. దేశ జనాభాలో కొద్ది భాగం మాత్రమే (సుమారు నాలుగు శాతం) ఆదాయపు పన్ను చెల్లిస్తుందన్నారు. ఆర్బిఐ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు చతుర్వేది.. బడ్జెట్లో ఇప్పటికే గుర్తించిన మొత్తం ఏడు ప్రాధాన్యతలు, సమ్మిళిత వృద్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి, సామర్థ్య వినియోగం, హరిత వృద్ధి, యువత, విద్యుత్, ఆర్థిక రంగాన్ని విస్తరించడంపై దృష్టిని కొనసాగించాలన్నారు.
Read Also:Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్
80 కోట్ల జనాభాకు ఉచిత ఆహార ధాన్యాల పథకానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా చతుర్వేది మాట్లాడుతూ.. చాలా ప్రయత్నాల తరువాత, భారతదేశం 35 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుండి బయటపడవేసింది.. వారు మళ్లీ అదే పరిస్థితికి రాకుండా అన్ని ప్రయత్నాలు చేయాలి. ఆహార కార్యక్రమాలు ఆ స్థాయిలో పరిష్కారంలో ఒక భాగం మాత్రమే. సూక్ష్మ , చిన్న సంస్థల అభివృద్ధి, మెరుగైన ఆరోగ్య కవరేజీ కోసం నిరంతర ప్రయత్నాలు.. పారిశుద్ధ్యానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆహార పథకం వంటి అన్ని చర్యలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. బదులుగా, గ్రామీణాభివృద్ధి వంటి ఇతర రంగాలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వ దృష్టి అవసరమన్నారు.
తాజావార్తలు
-
Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
-
ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Suriya: ‘హోంబాలే’తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
-
Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!