Budget 2024: బడ్జెట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న పన్ను చెల్లింపుదారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం కోసం వేచి చూడాల్సిందే. దీనితో పాటు, సాధారణ పన్ను చెల్లింపుదారులు కూడా మరో విషయం కోసం ఎదురు చూస్తున్నారు. బడ్జెట్లో పన్ను మినహాయింపు లేదా పన్ను పరిమితికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా పెద్ద ప్రకటన వస్తుందని ఆశపడుతున్నారు. అయితే దీనిపై నిపుణులు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో పన్నుకు సంబంధించి ప్రభుత్వం పెద్దగా ఎలాంటి ప్రకటన చేయకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బడ్జెట్లో టాక్స్ ఫ్రంట్పై రిలీఫ్ గురించి అడిగినప్పుడు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపిఎఫ్పి) ప్రొఫెసర్ ఎన్ఆర్ భానుమూర్తి, ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపుతాయని నేను అనుకోవడం లేదని అన్నారు. కానీ ప్రత్యక్ష పన్ను విధానం ప్రభావితం అవుతుంది. ప్రైవేట్ వినియోగం ఆందోళన కలిగించే విషయం కాబట్టి, పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నప్పుడు జీఎస్టీ కౌన్సిల్ దాని రేట్లను తగ్గించడాన్ని పరిగణించాలి.
Read Also:Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
మ్యూనిచ్కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలక మండలి సభ్యుడు చక్రవర్తి మాట్లాడుతూ.. దేశ జనాభాలో కొద్ది భాగం మాత్రమే (సుమారు నాలుగు శాతం) ఆదాయపు పన్ను చెల్లిస్తుందన్నారు. ఆర్బిఐ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు చతుర్వేది.. బడ్జెట్లో ఇప్పటికే గుర్తించిన మొత్తం ఏడు ప్రాధాన్యతలు, సమ్మిళిత వృద్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి, సామర్థ్య వినియోగం, హరిత వృద్ధి, యువత, విద్యుత్, ఆర్థిక రంగాన్ని విస్తరించడంపై దృష్టిని కొనసాగించాలన్నారు.
Read Also:Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్
80 కోట్ల జనాభాకు ఉచిత ఆహార ధాన్యాల పథకానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా చతుర్వేది మాట్లాడుతూ.. చాలా ప్రయత్నాల తరువాత, భారతదేశం 35 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుండి బయటపడవేసింది.. వారు మళ్లీ అదే పరిస్థితికి రాకుండా అన్ని ప్రయత్నాలు చేయాలి. ఆహార కార్యక్రమాలు ఆ స్థాయిలో పరిష్కారంలో ఒక భాగం మాత్రమే. సూక్ష్మ , చిన్న సంస్థల అభివృద్ధి, మెరుగైన ఆరోగ్య కవరేజీ కోసం నిరంతర ప్రయత్నాలు.. పారిశుద్ధ్యానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆహార పథకం వంటి అన్ని చర్యలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. బదులుగా, గ్రామీణాభివృద్ధి వంటి ఇతర రంగాలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వ దృష్టి అవసరమన్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!