Murder: ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టిన భార్య.. వెలుగులోకి సంచలన విషయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder: ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో ఓ అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి హత్య కేలులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నేరం మృతుడి భార్యేనని తేలింది. ఆమె ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. ప్రేమికుడితో కలిసి, తన భర్తను గొంతు నులిమి చంపింది. పోలీసుల విచారణలో నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు.
READ MORE: Russia Airspace Violation: రష్యా బరితెగింపు.. దీటుగా స్పందించిన నాటో కూటమి..
Also Read
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
బదౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన మూడు రోజుల క్రితం సెప్టెంబర్ 17న జరిగింది. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని లోహ్రా బహేరి నివాసి చోటే లాల్ కుమారుడు భూపేంద్ర సెప్టెంబర్ 17న అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. భూపేంద్రను గొంతు నులిమి చంపారు. మృతుడి తల్లి తన కోడలు రాజకుమారిపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు మృతుడి భార్యను పర్యవేక్షించడం ప్రారంభించారు. ఇంతలో శుక్రవారం ఆమె తన ప్రేమికుడు బల్వీర్తో షేఖుపూర్కు వెళ్లే మార్గంలో కనిపించింది. వీరి కలయిక పోలీసుల అనుమానాలను మరింత తీవ్రతరం చేసింది. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించారు.
READ MORE: Tirupati : తిరుపతిలో షాకింగ్ సంఘటన.. మద్యం మత్తులో పాము తల కొరికిన వ్యక్తి
విచారణలో భార్య రాజకుమారి నిజం ఒప్పుకుంది. తన భర్త మద్యం తాగి తనను తరచుగా కొట్టేవాడని.. కొంతకాలం క్రితం.. అతనిపై కేసు కూడా పెట్టానని చెప్పింది. ఎంతకీ వినకపోవడంతో హత్య చేసినట్లు వెల్లడించింది. ఇది మాత్రమే కాదు.. ఆమె తన పొరుగున్న ఉన్న బల్వీర్ తో వివాహేతర బంధం కలిగి ఉన్నట్లు అంగీకరించింది. సెప్టెంబర్ 17న తన భర్త మద్యం తాగి తనపై దాడి చేశాడని రాజకుమారి చెప్పింది. కోపంతో బల్వీర్ కు ఫోన్ చేసింది. వారిద్దరూ కలిసి భూపేంద్రను టవల్ తో గొంతు బిగించి చంపేశారు. భూపేంద్ర హత్యలో పాల్గొన్న బల్వీర్ కూడా పోలీసుల విచారణలో తనకు, రాజకుమారికి అక్రమ సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితురాలైన మహిళను, ఆమె ప్రేమికుడిని జైలుకు పంపారు.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!