Uttar Pradesh: బదౌన్లో స్కూల్ వ్యాన్ని ఢీకొన్న బస్సు, డ్రైవర్తో పాటు నలుగురు చిన్నారులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో స్కూల్ బస్సు, వ్యాన్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు పాఠశాల విద్యార్థులు, ఓ డ్రైవర్ మృతి చెందారు. డజను మందికి పైగా చిన్నారులు కూడా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ప్రమాద వార్త తెలియగానే చనిపోయిన చిన్నారుల ఇంట్లో విషాదం నెలకొంది. జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉన్న పిల్లలను మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ కుమార్తె కూడా మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె స్కూల్ వ్యాన్లోనే ఉంది.
Read Also:IND vs ENG: ఇంగ్లండ్పై విజయం.. వరల్డ్కప్ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు!
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
రెండు వాహనాలు (బస్సు, వ్యాన్) పాఠశాలకు వెళ్లేవి. వారి డ్రైవర్లు వారి వారి ప్రాంతాల నుండి పిల్లలను మయూన్ పట్టణంలోని SRPS ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు తీసుకువెళుతున్నారు. ఉసావా పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూన్-నబీగంజ్ రహదారిపై రెండు పాఠశాల వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో వ్యాన్ డ్రైవర్, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు, డ్రైవర్తో సహా మొత్తం 5 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత బాధిత కుటుంబాల్లో గందరగోళం నెలకొంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న డీఎం మనోజ్ కుమార్ సహా ఉన్నతాధికారులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎం ఆస్పత్రి పాలకవర్గాన్ని ఆదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న విద్యార్థులను వైద్య కళాశాలకు తరలించారు. రెండు వాహనాలు అతివేగంతో రావడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయని చెబుతున్నారు.
Read Also:Viral : ‘అభి తో పార్టీ షురు హుయ్ హై’.. యువకులపై మీద పడిన డీజే
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!