Lok Sabha Election 2024 : లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఎవరితోనూ పొత్తు లేదని తేల్చిన మాయావతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024 : బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధినేత్రి మాయావతి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవచ్చని ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి వార్తలను పుకార్లే అని ఆమె వ్యాఖ్యానించారు. అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆమె ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదట. గత లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో మాయావతి పార్టీ పొత్తు పెట్టుకుంది. మాయావతి ట్వీట్ చేస్తూ, ‘బీఎస్పీ పూర్తి సన్నద్ధతతో తన సొంత బలంతో దేశంలో లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో పోరాడుతోంది. ఎన్నికల కూటమి లేదా మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి వచ్చిన వార్తలన్నీ పుకార్లే. ఇలాంటి దుర్మార్గపు వార్తలు ఇచ్చి మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. యూపీలో బీఎస్పీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాలు అశాంతికి లోనవుతున్నాయి. అందుకే రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే బహుజన సమాజ్, బీఎస్పీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ఖాయమన్నారు.
Read Also:TDP-JanaSena-BJP Alliance: అమిత్షాతో ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. పొత్తు ఖరారు..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
మాయావతి కాంగ్రెస్తో చేతులు కలిపే అవకాశం ఉందని, యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూటమి భాగస్వాముల కోసం ఆమె పార్టీ వెతుకుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత లోక్సభ ఎన్నికల సమయంలో మాయావతి ఒంటరిగా ఎన్నికల రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచారు. తన ప్రత్యర్థి సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి కొన్ని వారాల క్రితం మీడియా సమావేశంలో ప్రకటించారు. బీఎస్పీ, కాంగ్రెస్ల పొత్తు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో రెండు పార్టీలకు మేలు చేస్తుందని చెబుతున్నారు. ఒకవేళ పొత్తు ఉంటే దళిత-ముస్లిం కూటమి ప్రయోజనాలు సాధించి ఉండేవారు. లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.
Read Also:ED Raids : లాలూ యాదవ్ సన్నిహితుడికి చెందిన ప్రాంగణాలపై ఈడీ దాడులు
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!