Lok Sabha Election 2024 : లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఎవరితోనూ పొత్తు లేదని తేల్చిన మాయావతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024 : బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధినేత్రి మాయావతి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవచ్చని ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి వార్తలను పుకార్లే అని ఆమె వ్యాఖ్యానించారు. అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆమె ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదట. గత లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో మాయావతి పార్టీ పొత్తు పెట్టుకుంది. మాయావతి ట్వీట్ చేస్తూ, ‘బీఎస్పీ పూర్తి సన్నద్ధతతో తన సొంత బలంతో దేశంలో లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో పోరాడుతోంది. ఎన్నికల కూటమి లేదా మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి వచ్చిన వార్తలన్నీ పుకార్లే. ఇలాంటి దుర్మార్గపు వార్తలు ఇచ్చి మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. యూపీలో బీఎస్పీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాలు అశాంతికి లోనవుతున్నాయి. అందుకే రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే బహుజన సమాజ్, బీఎస్పీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ఖాయమన్నారు.
Read Also:TDP-JanaSena-BJP Alliance: అమిత్షాతో ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. పొత్తు ఖరారు..
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
మాయావతి కాంగ్రెస్తో చేతులు కలిపే అవకాశం ఉందని, యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూటమి భాగస్వాముల కోసం ఆమె పార్టీ వెతుకుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత లోక్సభ ఎన్నికల సమయంలో మాయావతి ఒంటరిగా ఎన్నికల రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచారు. తన ప్రత్యర్థి సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి కొన్ని వారాల క్రితం మీడియా సమావేశంలో ప్రకటించారు. బీఎస్పీ, కాంగ్రెస్ల పొత్తు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో రెండు పార్టీలకు మేలు చేస్తుందని చెబుతున్నారు. ఒకవేళ పొత్తు ఉంటే దళిత-ముస్లిం కూటమి ప్రయోజనాలు సాధించి ఉండేవారు. లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.
Read Also:ED Raids : లాలూ యాదవ్ సన్నిహితుడికి చెందిన ప్రాంగణాలపై ఈడీ దాడులు
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?