BSE Market Capitalisation : ఏడాదిలో రూ.126లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSE Market Capitalisation : భారత స్టాక్ మార్కెట్కు సోమవారం చారిత్రాత్మకమైన రోజు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, నిఫ్టీ మళ్లీ జీవితకాల గరిష్టాన్ని తాకడంలో విజయవంతమైంది. రెండవది, స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేయబడిన కంపెనీల మార్కెట్ విలువ కూడా నేటి సెషన్లో రికార్డు స్థాయికి చేరుకుంది. బీఎస్సీలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ 19 ఫిబ్రవరి 2024న రూ.391.69 లక్షల కోట్ల వద్ద ముగిసింది. అయితే ఒక్క ఏడాదిలోనే భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద రూ.126 లక్షల కోట్లు పెరిగిందని తెలిస్తే షాక్ అవుతారు.
మార్కెట్ విలువలో 47శాతం జంప్!
నేటి సెషన్లో బిఎస్ఇలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.391.69 లక్షల కోట్ల వద్ద ముగిసింది. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం 20 ఫిబ్రవరి 2023న బీఎస్సీలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.265.91 లక్షల కోట్లు. అంటే.. కేవలం ఒక్క ఏడాదిలోనే బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల వాల్యుయేషన్లో రూ.126 లక్షల కోట్ల మేర పెరిగి, ఇందులో ప్రభుత్వ కంపెనీల షేర్లు పెద్దఎత్తున సహకారం అందించాయి. అంటే ఒక్క ఏడాదిలో మార్కెట్ వాల్యుయేషన్ 47 శాతానికి పైగా పెరిగింది.
Also Read
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
Read Also:Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే ధనధాన్య సమృద్ధి కలుగుతుంది
24 శాతం పెరిగిన నిఫ్టీ
మార్కెట్ విలువ పెరగడమే కాకుండా.. ఈ కాలంలో బిఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఇ నిఫ్టీ కూడా బలమైన పెరుగుదలను కనబరిచాయి. ఫిబ్రవరి 20, 2023న, సెన్సెక్స్ 60,710 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఇప్పుడు 72,708 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అంటే ఏడాది వ్యవధిలో సెన్సెక్స్ 12,000 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ ఏడాది క్రితం 17,844 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఇప్పుడు 22,122 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అంటే ఒక్క ఏడాదిలో నిఫ్టీలో 4278 పాయింట్ల జంప్ నమోదైంది. అంటే గత ఏడాది కాలంలో నిఫ్టీ 24 శాతం పెరిగింది.
400 లక్షల కోట్ల లక్ష్యం ఎంతో దూరంలో లేదు!
నేటి ట్రేడింగ్లో బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ గరిష్టంగా రూ.392 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక మార్కెట్లో ఎలాంటి బూమ్ కనిపిస్తోంది, రూ.400 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ లక్ష్యం ఎంతో దూరంలో లేదు.
Read Also:YSR Kalyanamasthu: నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల
తాజావార్తలు
-
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
-
Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?