NTV Telugu Site icon

Kadiyam Srihari: న్యాయ విచారణ మొదలు కాకముందే మంత్రులు తీర్పులు ఇచ్చేస్తున్నారు..

Kadiyam Srihari

Kadiyam Srihari

మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు తెలంగాణ మంత్రుల బృందం వెళ్లి సందర్శించారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఐదుగురు మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు.. అధికారులపై మంత్రులు ప్రశ్నలు వర్షం కురిపించారని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో 412 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.. వాటికి నిధులు సమీకరించలేక శ్వేత పత్రాలు, న్యాయ విచారణల పేరిట డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ద్రుష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. శ్వేత పత్రాలు న్యాయ విచారణలని స్వాగతిస్తున్నాం.. మేమే విచారణలు కోరామన్నారు.

Naga Shaurya: పెళ్ళై ఏడాది కాకముందే నాగశౌర్య వేరు కాపురం.. షాకింగ్ విషయాలు చెప్పిన తల్లి

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు.. కానీ 93 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని పీపీటీలో వారే చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం కింద పార లేదన్నారు.. వారిచ్చిన నివేదికలోనే 90 వేల ఎకరాల ఆయకట్టు వచ్చిందని తెలిపారు. తుమ్మిడిహట్టి దగ్గర తిరిగి ప్రాజెక్టు చేపడతామని ఉత్తమ్ అంటున్నారు.. నాడు వైఎస్ 2008 డిసెంబర్ 16 నాడు ప్రాణహితకు శంఖుస్థాపన చేశారు.. మహారాష్ట్ర అక్కడ ప్రాజెక్టుకు ఒప్పుకోలేదని అన్నారు. అక్కడ నీటి లభ్యత లేదని కేంద్ర జల వనరుల సంఘం లేఖ కూడా రాసిందని తెలిపారు. అన్నీ అంశాలు పరిగణనలోకి తీసుకుని మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకుని ప్రాణహిత ప్రాజెక్టును రీ డిజైన్ చేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. దాదాపు 11 రకాల అనుమతులు తీసుకున్నాకే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టు ఎక్కువగా ఉంది కనుకే అంచనా వ్యయం పెరిగిందని చెప్పారు. 140 టీఎంసీల మేర సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు కాళేశ్వరం కింద నిర్మించుకున్నాం కనుకే వ్యయం పెరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టుతో పాటు పాత ఆయకట్టును స్థీరీకరించుకున్నామన్నారు.

Perni Nani: వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదు..

మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగిపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. న్యాయ విచారణ మొదలు కాకముందే మంత్రులు తీర్పులు ఇచ్చేస్తున్నారు.. న్యాయ విచారణను మంత్రుల వ్యాఖ్యలు ప్రభావితం చేసేలా ఉన్నాయని విమర్శించారు. మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేసీఆర్ అడగలేదని ఉత్తమ్ అనడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. నేను డిప్యూటీ సీఎంగా ఉండగా.. కేసీఆర్ తో పాటు పీఎంను కలిసి కాళేశ్వరంకు జాతీయ హోదా అడిగామన్నారు. ఎన్నో సార్లు కేసీఆర్ పీఎం మోడీకి జాతీయ హోదా కోసం లేఖలు రాశారన్నారు. పాలమూరు రంగారెడ్డికి కూడా జాతీయ హోదా అడిగామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల అంచనాల వ్యయం పెరగడం గురించి విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో అంచనాలు పెరగకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయా అని ప్రశ్నించారు. పదే పదే ఆయకట్టు పెరగలేదు అంటున్నారు.. అదే నిజమైతే తెలంగాణలో ఇన్ని కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఎలా సాధ్యపడుతుంది? అని కడియం ప్రశ్నించారు. వరి ధాన్యం సేకరణకు చెల్లించిన డబ్బులు చూస్తే ఆయకట్టు పెరిగిందా లేదా తెలుస్తుందని కడియం శ్రీహరి తెలిపారు.